Friday, February 23, 2024

How sponge made? How does it absorb water? - స్పాంజిని ఎలా తయారుచేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకుంటుంది?


మనందరం ఇళ్లలో స్పాంజీలు వాడుతుంటాం. ఇల్లు తుడవడానికీ, ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికీ, కిటికీల అద్దాలు మెరవడానికీ, ఇలా స్పాంజీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఐతే... మీరెప్పుడైనా ఆలోచించారా.. నిండా కన్నాలు ఉండే స్పాంజీ, నీరు ఎలా పీల్చుకుంటోంది అని? దీన్ని ఎలా తయారుచేస్తారో మీకు తెలుసా?


స్పాంజి ఒక ప్లాస్టిక్‌ పాలిమర్‌. అంటే..ఇదొక పాలిమర్ ముద్ద. కాకపోతే ఇందులో చాలా కన్నాల గదులు ఉంటాయి. ఒక గదిలోంచీ మరో కన్నంలోకి గాలి, నీరు వెళ్లేలా వీలు ఉంటుంది. ఈ కన్నాల వల్లే స్పాంజీ చాలా పెద్దగా కనిపిస్తుంది. నిజానికి అవి లేకపోతే, దాని సైజు చిన్నగా ఉంటుంది. కన్నాల వల్లే అది బరువు తక్కువగా, తేలికగా ఉంటుంది.


ఈ స్పాంజీ తయారీలో ప్రత్యేక పద్ధతిని ఉపయోగిస్తారు. దీన్ని తయారుచేసేటప్పుడు లిక్విడ్ లాగా ఉండే పాలిమర్‌లోకి గాలి లేదా నైట్రోజన్ లేదా కార్బన్ డై ఆక్సైడ్‌ని నురగ రూపంలో పంపుతారు. దాంతో పాలిమర్‌లోకి అవి చొచ్చుకెళ్లి.. నిండిపోతాయి. ఆ తర్వాత పాలిమర్‌లో లిక్విడ్ ఆరిపోతుంది. దాంతో చిల్లుల స్పాంజీ తయారవుతుంది.


ఇంతకీ స్పాంజీలో నుంచి నీరు పోకుండా లోపల ఎలా ఉంటుంది అనేది కీలక ప్రశ్న. నీటికి పాకే గుణం ఉంటుంది. దీన్నే కాపిల్లారిటీ అంటారు. నీటి అణువులు ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయి. అలా అవి కలిసివుండేందుకు ప్రయత్నిస్తాయి. స్పాంజీలో నీటి చుక్కలు చిన్న చిన్నగా ఉంటూ.. వాటి మధ్య ఓ బంధాన్ని ఏర్పరచుకుంటాయి. మనం స్పాంజీని నొక్కినప్పుడు వాటి మధ్య తేడా వచ్చి, నీటి బిందువులు పెద్దవిగా అవుతాయి. దాంతో భూమి ఆకర్షణకు లోనై, స్పాంజీ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఇలా ఈ స్పాంజీ వెనక పెద్ద కథే ఉంది.



Thursday, February 22, 2024

Is Curry leaves Tree at home is not good? - ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉండకూడదా? దోషమా?

 


భారత దేశంలో కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. ఓ వైపు మన పెద్దలు వృక్షో రక్షతి రక్షితః అంటారు. అంటే, చెట్లను మనం కాపాడితే, అవి మనల్ని కాపాడతాయని అర్థం. సైంటిఫిక్‌గా కూడా ఇది నిజమే. చెట్లు వాయు కాలుష్యాన్ని పీల్చుకొని, మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఐతే, వాస్తు నిపుణుల్లో కొందరు ఇంటి ముందు, లేదా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉండకూడదు అంటారు. ఉంటే ఏమవుతుంది? అది కూడా చెట్టేగా? అనే ప్రశ్న తెరపైకి వస్తుంది.

వాస్తు శాస్త్రం చాలా విస్తృతమైనది. దాన్ని పైపైన అర్థం చేసుకుంటే, సరిగా అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే, ఈ రోజుల్లో వాస్తు శాస్త్రాన్ని చాలా మంది ఇష్టమొచ్చినట్లు చెబుతున్నారు. ఎవరికి వారే, వాస్తు నిపుణులుగా చెప్పుకుంటూ, రకరకాల అంశాల్ని తెరపైకి తెస్తున్నారు. దాంతో అసలు ఆ శాస్త్రానికి ఉన్న, వాస్తవికత లోపిస్తోంది. 

కరివేపాకు చెట్టు సంగతి చూస్తే, ఈ చెట్టు చాలా అందంగా ఉంటుంది. త్వరగా పెరుగుతుంది. మనం రోజూ కూరల్లో కరివేపాకును వాడుతాం. ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఈ చెట్టును ఇంటి ముందు పెంచవద్దని వాస్తు నిపుణులు ఎందుకు చెబుతారు అంటే.. ఇది ఇంటి దగ్గర ఉంటే, ఇరుగు పొరుగు వారు.. తరచూ వచ్చి, ఓ నాలుగు రెబ్బలు కరివేపాకు ఇమ్మని అడుగుతారు. దాంతో ఇంట్లో వాళ్లకు ఇది చికాకు కలిగిస్తుంది. అంతేకాదు.. ఈ చెట్టు చాలా ఎత్తు పెరిగి.. కరెంటు వైర్లకు అడ్డు రాగలదు. తద్వారా చెట్టు కొమ్మల ద్వారా కరెంటు పాసై, ముట్టుకున్నవారికి కరెంటు షాక్ కొట్టగలదు.

ఇంకా, ఈ చెట్టు వేర్లు.. ఇంటి పునాదిని దెబ్బతియ్యగలవు. అంతేకాదు ఇది ఇంటి ముందు ఉంటే, లోపలికి వచ్చేవారికి దీని కొమ్మలు అడ్డు అవుతాయి. ఇంకా ఈ చెట్టు గాలివానకి విరిగి పడితే, ప్రమాదమే. ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టే, కరివేపాకు చెట్టును ఇంటి దగ్గర పెంచవద్దు అంటారు కొందరు వాస్తు నిపుణులు. ఐతే.. హేతువాదులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించరు. అన్ని చెట్లలాగానే కరివేపాకును కూడా ఇంటి దగ్గర పెంచుకోవచ్చని చెబుతారు. ఎవరి ఒపీనియన్ వారిది.



Wednesday, February 21, 2024

Why Sun and Moon appear in big size at Sea - సముద్రం దగ్గర సూర్యుడు, చంద్రుడు ఎందుకు పెద్ద సైజులో కనిపిస్తాయి?

 


సాధారణంగా పర్యాటకులు సముద్ర తీరానికి ఉదయం లేదా సాయంత్రం వేళ వెళ్తారు. ఎందుకంటే వారు సూర్యోదయం, సూర్యాస్తమయం చూడాలనుకుంటారు. కొంతమంది రాత్రివేళ చందమామ రాక కోసం సముద్రం దగ్గర వేచి చూస్తారు. మన ఇళ్లు, పొలాలు, సిటీల్లో సూర్యుడు, చంద్రుడు ఒకే సైజులో కనిపిస్తాయి గానీ, సముద్రం దగ్గర మాత్రం అత్యంత పెద్ద సైజులో కనిపిస్తాయి. అది చూసినప్పుడు సూర్యుడు ఇంత పెద్దగా ఉంటాడా, చందమామను ఇంత పెద్దగా చూడొచ్చా అని ఆశ్చర్యపోతాం. ఇంతకీ అంత పెద్దగా కనిపించడానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా?


సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, చంద్రాస్తమయం వంటివి.. సముద్రం దగ్గరే కాదు.. కొన్ని ఇతర ప్రదేశాల్లో కూడా పెద్దగా కనిపిస్తాయి. అలా కనిపించాలంటే, భూమి - ఆకాశం కలిసినట్లుగా ఉండాలి. సరిగ్గా అలాంటి ప్రాంతంలో పెద్దగా కనిపిస్తాయి. మీరు ఏదైనా కొండపైకి వెళ్లి, సూర్యోదయాన్ని చూస్తే, అక్కడ కూడా సూర్యుడు పెద్దగానే కనిపిస్తాడు. ఇందుకు భూమి - ఆకాశం కలిసినట్లు ఉండే ప్రాంతం మీకు దూరంగా ఉండి తీరాలి.


మధ్యాహ్నం ఎందుకిలా?

మనం గమనిస్తే, ఉదయం, సాయంత్రం పెద్ద సైజులో కనిపించే సూర్యుడు, మధ్యాహ్నం వేళ చిన్నగా ఉంటాడు. నిజానికి సూర్యుడు ఎప్పుడూ ఒకే సైజులో ఉంటాడు. మనకు వేర్వేరు సైజుల్లో కనిపించడానికి కారణం మానవ దృష్టి భ్రమ (హ్యూమన్ ఆప్టికల్ ఇల్యూషన్ - human optical illusion) అని పరిశోధనల్లో తేలింది. 


ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యుడి సైజును మనం ఇతర వాటితో పోల్చి చూస్తాం. అంటే సముద్ర నీరు, ఓడలు, ఇళ్లు, చెట్ల వంటి వాటితో పోల్చి చూస్తాయి మన కళ్లు. అప్పుడు, వాటి కంటే సూర్యుడు పెద్దగా ఉన్నట్లు కనిపిస్తాడు. మధ్యాహ్నం వేళ అలా పోల్చడానికి వీలుండదు. ఎందుకంటే సూర్యుడు నడినెత్తిన, ఆకాశంలో ఉంటాడు. అందువల్ల మనకు అప్పుడు సైజ్ కంపారిజన్ లేకపోవడంతో మన కళ్లు చిన్నగా కనిపిస్తున్నట్లు భావిస్తాయి.



Tuesday, February 20, 2024

Why do fruits ripen seasonally? - పండ్లు సీజన్ల వారీగా ఎందుకు కాస్తాయి?


మీరు గమనించే ఉంటారు అరటి, జామ లాంటి కొన్ని పండ్లు  తప్పితే, చాలా పండ్లు సీజన్ల వారీగా కాస్తాయి. అంటే సీతాఫలాలు శీతాకాలంలో వస్తాయి. యాపిల్స్ వర్షాకాలంలో వస్తాయి. మామిడిపండ్లు, పుచ్చకాయలు ఎండాకాలంలో వస్తాయి. ఇలా ఒక్కో సీజన్‌లో ఒక్కో రకమైన పండ్లు ఎక్కువగా లభిస్తాయి. అవి సంవత్సరమంతా లభించవచ్చు కదా అని మనకు అనిపించవచ్చు. మరి అలా ఎందుకు జరగదో తెలుసుకుందాం.


మనకి ఎలాగైతే జన్యువులు (Genes) ఉంటాయో, చెట్లకూ అలాగే ఉంటాయి. ఒక్కో చెట్టుకి ఒక్కో రకమైన జెనెటిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌కి తగినట్లే ఆ చెట్టు ఆకారం, ఆకుల తీరు, పండ్ల రుచి ఇలా అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఐతే.. ఈ కోడ్‌ని అనుసరించి ఆయా చెట్లు పండ్లను కాస్తాయి. చెట్లు చేసే ప్రతీ పనీ ఈ జన్యువులపై ఆధారపడి ఉంటుంది. చెట్లకు పువ్వులు, కాయలు, పండ్లు రావాలంటే.. వాతావరణంలో లభించే వివిధ రకాల మూలకాలు అవసరం. అంటే తగిన ఉష్ణోగ్రత, తగిన గాలి, తగిన పోషకాలు, తగిన తేమ, భూమిలో తగిన ఖనిజాలు ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కావాల్సిన మోతాదులో అందినప్పుడే ఆ చెట్లు పండ్లను ఇస్తాయి. 


జన్యువుల ప్రకారం కావాల్సిన వాటిలో ఏదైనా తగ్గితే, పండ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే పండ్ల సైజు, వాసన, రుచిలో కూడా తేడా వస్తుంది. అన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడు వచ్చే పండ్లు చాలా పెద్దగా, రుచికరంగా ఉంటాయి. జపాన్ లాంటి దేశాల్లో రైతులు అత్యంత ఆధునిక పద్ధతులతో పండ్లను పండిస్తూ, రుచి, సైజు, నాణ్యత అన్నీ పక్కాగా ఉండేలా చేస్తారు. అందువల్లే జపాన్ పండ్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది.


జన్యువుల తీరును బట్టీ.. ఆయా చెట్లు.. ఆయా సీజన్లలో తమకు కావాల్సిన వాటిని పొందుతాయి. తద్వారా పువ్వులు, పండ్లను ఇస్తాయి. జామ చెట్లకు ఉన్న జన్యువుల ప్రకారం.. ఆ చెట్లు సంవత్సరమంతా కాయలు ఇవ్వగలవు. అదే సీతాఫలం విషయానికి వచ్చే సరికి.. వాటికి తక్కువ ఎండ, గాలిలో తేమ ఉండాలి. వరికి ఎక్కువ నీరు, ఎక్కువ ఎండ ఉండాలి. మామిడికి ఎండ బాగా ఉండాలి. ఇండియా లాంటి దేశంలో సంవత్సరానికి 6 రకాల సీజన్ల మార్పులు వస్తాయి. అందుకు తగినట్లుగానే మన దేశంలో అన్ని రకాల కాయలు, పండ్లూ కాస్తాయి.  

How camel live long without thirsy? - ఒంటెలు నీరు తాగకుండా ఎక్కువ సేపు ఎలా ఉండగలవు?


మనం ఒంటెల్ని డైరెక్టుగా చూడాలంటే ఏ రాజస్థాన్‌కో వెళ్లాలి. లేదా ఒంటెల్ని పెంచుకునేవారు మన ఇళ్లవైపు వస్తే చూడగలం. జూలలో ఒంటెలు కనిపించవు. కానీ ఏనుగు లాగా వాటి నిలువెత్తు ఆకారం మనల్ని ఆకట్టుకుంటుంది. వాటిని చూసినప్పుడు మనకు ఓ డౌట్ వస్తుంది. ఒంటెలు నీరు తాగకుండా ఎక్కువ సేపు ఎలా ఉండగలవు అని. నిజమే మరి.. మనం ఎండలో ఓ గంట తిరిగితే, దాహం వేసేస్తుంది. ఆ రోజంతా మనం ఎక్కువగా నీరు తాగుతూనే ఉంటాం. ఎందుకంటే.. ఎండలో తిరిగిన గంటలోనే మన శరీరంలో చాలా నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. మరి ఒంటె విషయంలో ఏం జరుగుతుంది?


ఒంటెలు తమ వీపుపై ఉండే మూపురాల్లో నీటిని దాచుకుంటాయనీ, అవసరమైనప్పుడు ఆ నీటిని కొద్దికొద్దిగా తాగుతాయని పిల్లలు భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. ఒంటె మూపురంలో కొవ్వు పదార్థం ఉంటుంది. ఒంటెలు 50 డిగ్రీల ఎండలో కూడా, ఎడారిలో ఏమాత్రం అలసట లేకుండా తిరగగలవు. ఎడారిలో నీరు దొరకడం చాలా కష్టం. వందల కిలోమీటర్లు నేలలో ఇసుకే తప్ప నీరు కనిపించదు. ఇలాంటి సమయంలో ఒంటెలు ఎనర్జీ కోసం మూపురాల్లోని కొవ్వును వాడుకుంటాయి. దూరం పెరిగేకొద్దీ ఒంటె మూపురం సైజు తగ్గిపోతుంది. అందులో కొవ్వు కరిగిపోతుంది. దాంతో అది వదులుగా కనిపిస్తుంది. 


నీరు తాగకుండా ఎంత కాలం ఉండగలవు?

ఒంటెలు ఎడారుల్లో నీరు తాగకుండా మూడు వారాల వరకు ప్రయాణించగలవు. ఒంటెల ముక్కుల్లో సన్నని వెంట్రుకలు ఉండటాయి. అవి గాలిలో ఉండే తేమను గ్రహిస్తాయి. తద్వారా శరీరం నుంచి చెమట రూపంలో పోయే నీటిని భర్తీ చేసుకోగలవు. తద్వారా ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెంటిగ్రేడు వరకు తగ్గించుకోగలవు. 


ఎంత నీరు తాగుతాయి?

నీరు లేకపోయినా వందల కిలోమీటర్లు, మండే ఎండలో నడిచే ఒంటెలు, ఎక్కడైనా ఒయాసిస్సు కనిపిస్తే, అక్కడ నీరు తాగుతాయి. ఆ సమయంలో అవి కొన్ని నిమిషాల్లోనే దాదాపు 100 లీటర్ల నీరు తాగగలవు. మనిషి ఒకేసారి చాలా ఎక్కువ నీరు తాగితే, చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఒంటెల విషయంలో అలా జరగదు. వాటి రక్తంలోని ఎర్ర రక్తకణాలు గోళాకారంలో, గుండ్రంగా ఉంటాయి. అందువల్ల ఎంత నీరు తాగినా, వాటి బాడీలోని ద్రవాల్లో తేడాలు రావు. అందువల్ల వాటికి ఏ హానీ జరగదు. ఇలా ఎడారుల్లో నడవడానికీ, బతకడానికీ అనుకూలంగా ఒంటెల జీవన శైలి ఉంటుంది. అందుకే వాటిని ఎడారి ఓడ అంటారు.

Monday, February 19, 2024

Where is Flight MH370?


Disappearance of Malaysia Airlines Flight MH370 has captivated people for decades. On March 8, 2014, the aircraft, a Boeing 777-200ER, vanished while flying from Kuala Lumpur International Airport in Malaysia to Beijing Capital International Airport in China.

The last known position of MH370 was over the southern Indian Ocean, but despite extensive search efforts, the wreckage of the plane was not found for a considerable amount of time. In July 2015, a piece of the wing, known as a flaperon, washed ashore on Reunion Island in the Indian Ocean, confirming that the plane had indeed crashed.

However, the main wreckage and the majority of the passengers' remains have never been located. The disappearance has led to numerous theories and speculation, ranging from mechanical failures to deliberate actions by the crew. The mystery of MH370 remains unsolved, and it has become one of the most perplexing aviation mysteries in history.

What Vastu Shastra say about 4 directions? - వాస్తు శాస్త్రం ప్రకారం 4 దిశల్లో ఏవేవి, ఎక్కడ ఉండాలి?

 


మనం దిక్కులు అనగానే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని చెప్పుకుంటాం. వాస్తు శాస్త్రం.. మరో 4 దిక్కులను కూడా చెబుతుంది. అవే ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం (ఆనైవాఈ). ఈ నాలుగు దిక్కుల్లో ఏయే వస్తువులు ఎక్కడ ఉండాలో వాస్తు నిపుణులు చెబుతారు. అవి అలా ఉంటే, వాస్తు దోషం ఉండదని అంటారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఆగ్నేయం:

ఆగ్నేయ దిశలో కిచెన్ గది ఉంటూ, అందులో స్టవ్‌ని ఆగ్నేయ మూలలో ఉంచాలి. వంట వండేటప్పుడు వచ్చే పొగ బయటికి వెళ్లేలా దక్షిణ ఆగ్నేయం (SE), తూర్పు ఆగ్నేయం (ES)లో కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వంట వండేటప్పుడు తప్పనిసరిగా కిటికీలు తెరచి ఉంచాలి. తద్వారా పొగ బయటకు పోయి, క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుంది.


నైరుతి:

నైరుతి దిశలో మనకు కావాల్సిన వస్తువుల్నీ, విలువైన వాటినీ, పత్రాలనూ దాచుకోవాలి. ఇంటి యజమాని ఈ దిశలో ఉండాలి. త్వారా దక్షిణం నుంచి వచ్చే గాలి ఇంటి యజమానికి తగులుతుంది. పడమర నైరుతి (WS), దక్షిణ నైరుతి (SW) దిక్కు నుంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ గది కీలకమైనది కాబట్టి భద్రత పరంగా గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే.. నైరుతి దిశలో బరువు ఉండాలి. అందువల్ల నీటిని స్టోర్ చేసే ఓవర్‌హెడ్ ట్యాంకును ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు.


వాయవ్యం:

వాయవ్య దిశలో బాత్‌రూమ్, టాయిలెట్, పశువుల పెంపకం వంటివి చేస్తారు. ఈ దిశ నుంచి వచ్చే గాలి, చెడు వాసనలు ఇంట్లోకి రాకుండా, ఆ వాసనలు బయటకు పోయేలా ఏర్పాట్లు ఉండాలి.


ఈశాన్యం:

ఈశాన్య దిశలో నుయ్యి లేదా బోరు వేసుకోవచ్చు లేదా నీటిని స్టోర్ చేసే సంపు కూడా నిర్మించుకోవచ్చు. ఈ దిశలో ఎక్కువ స్థలం ఖాళీగా  ఉండాలి. ఎండ, గాలి బాగా వచ్చేలా చెయ్యాలి. తద్వారా నీరు శుభ్రంగా ఉంటుంది.


ఇంకా వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని మొత్తం అర్థం చేసుకోవడానికి ఓ సంవత్సరం పట్టొచ్చు. వాస్తు శాస్త్రం చాలా విస్తృతమైనది. ప్రపంచంలోని చాలా దేశాలు దీన్ని ఫాలో అవుతున్నాయి. కొన్ని దేశాల్లో వేర్వేరు పేర్లతో ఇది ఆచరణలో ఉంది. ఇండియాలో ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు, భవనాలు, బ్యారేజ్‌లు ఇలా ప్రతీ దానికీ ఇంజినీరింగ్ ఫార్ములాలతోపాటూ.. వాస్తు నియమాలు కూడా పాటిస్తారు. ఇది సంప్రదాయంగా వస్తున్న ఆచారంగా మారింది. వాస్తును నమ్మని వారు సైతం.. తమ ఇళ్ల నిర్మాణంలో వాస్తును పాటిస్తుంటారు. పాటిస్తే పోయేదేముంది అని భావిస్తారు.


Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని E-పలుకు నిర్ధారించట్లేదని గమనించగలరు.

Why only Oxygen dissolves in blood - రక్తంలో ఆక్షిజన్ మాత్రమే ఎందుకు కలుస్తుంది?

 


మనం ఒక పెద్ద డబ్బాలో గోలీలు, చాక్లెట్లు, లాలీపప్‌లు, క్యాండీలను వేస్తే.. అవన్నీ ఆ డబ్బాలో పడతాయి. అలా కాకుండా.. చాక్లెట్లు మాత్రమే పడి, మిగతావి పడకపోతే, ఎందుకు పడట్లేదని మనం ఆలోచిస్తాం. ఇదే ప్రశ్నను మనం ఆక్సిజన్ విషయంలో కూడా వేసుకోవాలి. ఎందుకంటే.. మనం గాలిని ముక్కు ద్వారా పీల్చినప్పుడు.. ఆక్సిజన్‌తోపాటూ, నైట్రోజన్, ఇతర వాయువులు కూడా ఉంటాయి. కానీ, ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ మాత్రమే రక్తంలో కలుస్తుంది. మిగతావి కలవవు. ఎందుకు అనేదే ప్రశ్న. వివరంగా తెలుసుకుందాం.


గాలిలో ఏముంటాయి?

పై ప్రశ్నకు సమాధానం వెతికే ముందు.. అసలు గాలిలో ఏమేం ఉంటాయో మనకు తెలియాలి. గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్ ప్రధానంగా ఉంటాయి. గాలిలో నైట్రోజన్ 80 శాతం ఉంటుంది. ఆక్సిజన్ 20 శాతం ఉంటుంది. కానీ 80 శాతం ఉన్న నైట్రోజన్ తిరిగి బయటకు వచ్చేస్తుంది. 20 శాతం ఉన్న ఆక్సిజన్ మాత్రం రక్తంలో కలుస్తుంది. 


ఊపిరితిత్తుల్లో ఏం జరుగుతుంది?

మీరు స్టడీ బుక్స్‌లో చదివే ఉంటారు. ఉపిరితిత్తులు (Lungs) స్పాంజీలలాగా ఉంటాయి. వాటిలోకి గాలి వెళ్తుంది. అక్కడ పలుచని చర్మంతో రక్తనాళాలు ఉంటాయి. వాటిలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రక్తంలో హిమోగ్లోబిన్ (hemoglobin) ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్‌కి మాగ్నెటిక్ తరహా పవర్ (అయస్కాంత ధర్మం) ఉంటుంది. ఇదే పవర్ ఆక్సిజన్‌కి కూడా ఉంటుంది. దాంతో హిమోగ్లోబిన్ ఆకర్షించగానే, ఆక్సిజన్ ఆకర్షణ చెందుతుంది. దాంతో అది రక్తంలో కలుస్తుంది.


నైట్రోజన్‌కి మాగ్నెటిక్ తరహా పవర్ లేదు. అందువల్ల అది రక్తంలో కలవదు. ఐతే.. నైట్రోజన్‌తో మనకు ప్రత్యేక అవసరం ఉంటుంది. ఈ నైట్రోజన్ 80 శాతం ఉండటం వల్ల ఇది పీడనం కలిగిస్తూ, ఆక్సిజన్‌ను అన్ని మూలలకూ నెడుతుంది. అలా నెట్టడం వల్లే ఆక్సిజన్, రక్తనాళాల దగ్గరి దాకా వెళ్తుంది. అదే నైట్రోజన్ లేకపోతే, ఆక్సిజన్ అంత మూలల్లోకి వెళ్లదు. ఇలా మనం పీల్చే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ రెండూ కీలకమైనవే. దేని పని అవి చేస్తాయి. 


రక్తంలో కలిసే ఆక్సిజన్.. శరీరంలోని ప్రతీ కణానికీ చేరుతుంది. తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. శ్వాస సమస్యలు ఉండేవారు.. రక్తాన్ని పెంచుకోవాలి. అంటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగేలా చేసుకోవాలి. అందుకోసం వారు.. బంగాళాదుంపలు, బీట్‌రూట్, ఆకుకూరలు, ఖర్జూరాలు, ద్రాక్ష, కిస్‌మిస్, నువ్వులు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, దానిమ్మ, ఆరెంజ్ వంటి పుల్లటి పండ్లు తినాలి. టీ, కాఫీలు, కూల్‌డ్రింక్స్ వంటివి తగ్గించుకోవాలి. 

(Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.)



Sunday, February 18, 2024

How Robot born? - రోబో ఎలా పుట్టింది? చరిత్ర ఏమిటి?

 


ఇప్పుడు మనం వాడుతున్న టీవీ, సెల్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్, కెమెరాలు, టార్చ్‌లైట్లు, వాల్ క్లాక్‌లూ ఇవన్నీ.. మనిషి అవసరాలతో పుట్టినవే. అవసరం కొత్త వాటిని కనిపెట్టేలా చేస్తుంది. కాలం గడిచే కొద్దీ టెక్నాలజీ కొత్త రూపం సంతరించుకుంటూనే ఉంటుంది. రోబో టెక్నాలజీ కూడా అలా పుట్టిందే. రోబో (Robot)కి తెలుగు పదం మరమనిషి. కానీ మనం రోబో అనే పిలుస్తుంటాం. ఎందుకంటే మనం ఇంగ్లీష్ పదాల్ని మన తెలుగులో కలిపేసుకుంటాం. దాంతో అవి తెలుగు అయిపోతాయి. ఆ విషయం అలా ఉంచితే, తొలి రోబోను 1948లో ఇంగ్లాండ్ లోని గ్రేవాల్టర్ తయారుచేశారు. దాన్ని ఎలక్ట్రానిక్ ఆటోనామస్ రోబోట్ (Electronic Autonomous Robots) అని పిలిచారు.


చరిత్ర:

క్రీస్తుపూర్వం 450 సంవత్సరంలో గ్రీకు గణిత శాస్త్రవేత్త ఆర్కిటస్ ఒక మరపక్షిని తయారుచేసి.. ఆవిరి ద్వారా ఎగరేశారని తెలుస్తోంది. ఆధునిక యుగంలో రోబో అనే మాటను మొదట కారెట్ లేపెక్ అనే చెక్ రచయిత ఉపయోగించారు. చెక్ భాషలో రోబో అంటే బానిస అని అర్థం. ఆయనకు ఆ పదాన్ని, ఆయన తమ్ముడైన జోసఫ్ లేపెక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


1950 తర్వాత రోబోల తయారీ జోరందుకుంది. అమెరికా, జపాన్ దేశాలు అభివృద్ధి చెందుతూనే, రోబోల తయారీపైనా దృష్టి పెట్టాయి. ఆ తర్వాత రోబోల తయారీ కోసం రోబోటిక్స్ అనే సైన్స్ వచ్చింది. ఇప్పుడు రోబోలు తయారుచేసేవారు.. రోబోటిక్స్ నేర్చుకుంటున్నారు.


చాలా ప్రయోజనాలు:

రోబోలను చాలా సినిమాల్లో నెగెటివ్‌గా చూపిస్తున్నారు. నిజానికి అవి మనిషి కంట్రోల్‌లో పనిచేసే యంత్రాలు మాత్రమే. మనం ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, టీవీ ఇవన్నీ ఎలా వాడతామో, రోబోను కూడా అలాగే వాడగలం. కాకపోతే అవి మనిషి ఆకారంలో ఉండటంతో.. అవి మనకు వ్యతిరేకంగా మారతాయేమో అనే సందేహం వస్తూ ఉంటుంది. నిజానికి ఇప్పుడు రోబోలు లేని రంగం లేదు. గనుల్లో, బాంబుల్ని తొలగించే పనుల్లో, ఆస్పత్రుల్లో సర్జరీలు చెయ్యడానికీ, ఇంట్లో పనిమనిషిలా, పెరట్లో కుక్కలా, ఫ్యాక్టరీల్లో కార్మికుడిలా, హోటళ్లలో సేవకుల్లా, స్కూల్లో టీచర్లలా ఇలా రోబోలు చాలా పనులు చేస్తున్నాయి. 


ఇండియాలో రోబో విప్లవం ఇంకా రాలేదు. ప్రస్తుతం మొబైల్ విప్లవం, సోలార్ విప్లవం, డ్రోన్ విప్లవం, ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం నడుస్తున్నాయి. త్వరలోనే రోబో రివల్యూషన్ కూడా వచ్చి తీరుతుంది. దీనికి AIతో దగ్గర సంబంధం ఉంటుంది. AI మరింత విస్తరించాక, రోబోలు ఇంటింటికీ వచ్చేస్తాయి. 


జపాన్ లాంటి దేశాల్లో రోబోల వాడకం బాగా పెరిగింది. కరోనా వ్యాధి వచ్చినప్పుడు రోగుల దగ్గరకు మనుషుల బదులు రోబోలు వెళ్లి సేవలు అందించాయి. ఇలా మనిషి చెయ్యలేని చాలా పనులను రోబోలు చేస్తున్నాయి. ప్రస్తుతం సింథటిక్ తొడుగులతో అచ్చం మనిషిలా మాట్లాడే, హావభావాలు పలికించే రోబోల కాలం నడుస్తోంది. అందువల్ల మున్ముందు ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


పొంచివున్న ప్రమాదం:

రోబోలు మనిషిలా ఆలోచించడం మంచిది కాదు అనే అభిప్రాయం కొందరు శాస్త్రవేత్తల్లో ఉంది. అలా ఆలోచించే రోబోలు.. మనిషి తరహాలోనే స్వార్థాన్ని పెంచుకొని, వినాశనాలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకూ అలా జరగలేదు. భవిష్యత్తులోనూ అలా జరగకూడదని కోరుకుందాం.

Why is the shade of a tree cool? చెట్టు నీడ చల్లగా ఎందుకుంటుంది?

 


చెట్లతో మనకు విడదీయరాని బంధం ఉంటుంది. మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్‌ని చెట్లు పీల్చుకుంటాయి. అలాగే అవి వదిలే ఆక్సిజన్‌ని మనం పీల్చుకుంటాం. ఈ విశ్వంలో చెట్లు లేకపోతే, మనం కూడా లేనట్లే. అది అలా ఉంచితే, చెట్టు కిందకు వెళ్లగానే, ఆ నీడ మనకు చల్లని ఫీల్ కలిగిస్తుంది. అదే ఏ భవనం సెల్లార్ లోకో వెళ్తే, ఉక్కపోతగా ఉంటుంది. ఎందుకీ తేడా అని ఎప్పుడైనా ఆలోచించారా?


దీనికి సింపుల్ ఆన్సర్.. చెట్లకు జీవం ఉంటుంది.. భవనాలకు ఉండదు అనే. గోడపై ఎండ పడినప్పుడు ఆ ఎండకి సంబంధించిన వేడి కిరణాలు గోడతోపాటూ.. ఆ చుట్టుపక్కల అంతటా వ్యాపిస్తాయి. అవి గోడలోపల, బయట కూడా ఉంటాయి. గోడ వాటిని పీల్చుకోదు. దాంతో గోడ పక్కన నీడ ఉన్నా, కిరణాల వేడి మనకు తగులుతూ, వేడిగా అనిపిస్తుంది. చెట్ల విషయంలో ఇలా జరగదు. చెట్ల ఆకులపై ఎండ పడినప్పుడు, ఆ ఆకులు.. ఆ ఎండను ఉపయోగించుకొని, ఆహారం తయారుచేసుకుంటాయి. అలాగే.. మిగతా ఎండ తమపై పడకుండా ఉండేలా ఆకులు, స్వయంగా నీటి ఆవిరిని విడుదల చేస్తాయి. దాంతో ఆకుల దగ్గర ఓ రకమైన చల్లదనం ఉంటుంది. ఆ ఆకుల నుంచి వచ్చే గాలి కూడా చల్లబడి, చెట్టు కింద చల్లటి వాతావరణాన్ని ఏర్పరస్తుంది. అందుకే మనం చెట్ల కిందకు వెళ్తే, చల్లగా అనిపిస్తుంది. 


వర్షాకాలంలో మాత్రం చెట్ల కిందకు వెళ్లకూడదు. చెట్లు పిడుగుల్ని ఆకర్షిస్తాయి. అందువల్ల చెట్లపై పిడుగులు పడుతుంటాయి. అలాంటి సమయంలో అక్కడ ఎవరైనా ఉంటే, చనిపోయే ప్రమాదం ఉంటుంది.

How earth revolves around the sun? - సూర్యుడి చుట్టూ భూమి ఎలా తిరగగలుగుతోంది?

 


మనం ఓ బొంగరాన్ని తిప్పితే, అది ఒక నిమిషం తిరిగి, ఆగిపోయి, పడిపోతుంది. ఆ నిమిషం పాటూ తిరగడానికి కారణం దాన్ని మనం బలంగా తిప్పడం ద్వారా దానికి లభించిన ఎనర్జీయే. ఒక తిరుగుతున్న ఫ్యాన్‌ని మనం స్విచ్ ఆఫ్ చేస్తే, 2 నిమిషాల్లో అది ఆగిపోతుంది. కారణం.. అప్పటివరకూ దానికి లభించిన ఎనర్జీ, స్విచ్ ఆఫ్ చెయ్యగానే ఆగిపోవడం వల్లే. మరి సూర్యుడి చుట్టూ భూమి ఏ ఎనర్జీతో తిరుగుతోంది? దానికి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తోంది. మరో ప్రశ్న కూడా ఉంటుంది. భూమి నిరంతరం ఒకే వేగంతో తిరుగుతోంది. ఇదెలా జరుగుతోంది? భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది? తెలుసుకుందాం.


సూర్యుడి చుట్టూ భూమి,  ఇతర గ్రహాలూ తిరగడానికి కారణం సూర్యుడు వాటిపై ప్రయోగించే గురుత్వాకర్షణ శక్తి. న్యూటన్‌ విశ్వ గురుత్వాకర్షణ సూత్రం (Newton Gravitational Law) ప్రకారం విశ్వంలోని రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలం వాటి ద్రవ్యరాశులపై, వాటి మధ్య ఉండేదూరంపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న వస్తువు, తక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువును ఆకర్షిస్తుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఎక్కువ బరువు ఉన్న వస్తువు, తక్కువ బరువు ఉన్న వస్తువును తనవైపు ఆకర్షిస్తుంది. వస్తువుల మధ్య దూరం ఎక్కువయ్యేకొద్దీ ఆకర్షక బలం తగ్గుతుంది. 


సూర్యుని ద్రవ్యరాశితో పోలిస్తే, గ్రహాల ద్రవ్యరాశి చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే.. సూర్యుడు 99.8 శాతం ద్రవ్యరాశి (mass) కలిగివుంది. మిగతా 0.2 శాతం మాత్రమే ఈ గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు వంటివి ఉన్నాయి. అందువల్ల సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ఈ గ్రహాలను బలంగా తనవైపు లాగుతూ ఉంటుంది కాబట్టే, అవి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి.


మనం ఓ బంతిని నేలపై జారవిడిస్తే, అది భూమి తరహాలోనే తనచుట్టూ తాను తిరుగుతూ.. కొంత దూరం వెళ్తుంది. ఇదే విధంగా భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో తన చుట్టూ తాను తిరుగుతున్నట్లుగా దొర్లుతోంది అనుకోవచ్చు. మరైతే సూర్యుడు దాన్ని పూర్తిగా లాగేసుకోవచ్చు కదా.. ఎందుకు అలా జరగట్లేదు అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి మరో కారణం ఉంది. ఏదైనా వస్తువు నిర్ధిష్ట వేగం కంటే ఎక్కువ వేగంతో తిరుగుతూ ఉంటే, దాన్ని గురుత్వాకర్షణ శక్తి పూర్తిగా లాగేసుకోలేదు. భూమి సెకండ్‌కి 30కిలోమీటర్ల వేగంతో సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. కాబట్టి భూమిని సూర్యుడు లాక్కోలేకపోతున్నాడు. 


ఇదే లెక్క భూమికి చూస్తే, భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకోవాలంటే.. ఆ వస్తువు సెకండ్‌కి 11 కిలోమీటర్లకు పైగా వేగంతో తిరగాలి. భూమిపై ఉన్న మనం.. భూమి ఆకర్షణను తప్పించుకొని విశ్వంలోకి వెళ్లిపోవాలంటే మనం సెకండ్‌కి 11 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లాలి. లేదంటే, వేగం తగ్గితే, భూమి మనల్ని తిరిగి లాగేయగలదు. భూమి చుట్టూ తిరిగే చందమామను భూమి లాక్కోలేకపోతోంది. కారణం చందమామ అతి వేగంతో తిరుగుతుండటమే. చందమామ సెకండ్‌కి 1 కిలోమీటర్ వేగంతో తిరుగుతోంది. ఐతే.. చందమామ భూమికి చాలా దూరంగా ఉండటం వల్ల.. ఆ వేగంతో తిరుగుతున్నా, దాన్ని భూమి లాక్కోలేకపోతోంది.


మీకు మరో డౌట్ రావచ్చు.. నేలపై బంతి దొర్లుతూ వెళ్తుంది. కానీ భూమి విశ్వంలో తేలుతున్నట్లుగా ఉంది కదా. మరి అది ఎందుకు దొర్లుతోంది? దేనిపై దొర్లుతోంది అనే ప్రశ్నలు రావచ్చు. దీనికి ఐన్‌స్టైన్ సాపేక్షతా సిద్ధాంతం (Theory of Relativity)లో కొంత సమాధానం ఉంది. దీని ప్రకారం.. ఈ విశ్వంలో మనకు తెలియకుండా ఓ రకమైన వల లాంటిది ఉంది. అది మన కంటికి కనిపించట్లేదు. అది మన స్ఫర్శకు రావట్లేదు. ఈ గ్రహాలన్నీ ఆ వలలోనే ఉంటూ, తిరుగుతున్నాయన్నది ఈ సిద్ధాంతం చెబుతున్న మాట. ఈ వల కారణంగానే గ్రహాలు.. దొర్లుతున్నట్లుగా కాస్త పక్కకు వంగి తిరుగుతున్నాయని అంటున్నారు. ఐతే.. ఇదే వల గ్రహశకలాలు (Asteroids), తోక చుక్కలు, ఉల్కలకి ఎందుకు వర్తించట్లేదు? అవి ఇష్టమొచ్చినట్లు ఎందుకు తిరుగుతున్నాయి అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తోంది.


భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎలాంటి శక్తినీ విడుదల చెయ్యట్లేదు. అందువల్ల భూమి బరువు తగ్గట్లేదు. అందువల్లే భూమి ఎప్పుడూ ఒకే వేగంతో తిరుగుతోంది. భూమి ఇలా తిరగడం ఆగిపోయే ఛాన్సే లేదు. ఎందుకంటే, దాన్ని ఆపేందుకు ఏ శక్తీ ప్రయత్నించట్లేదు. 


సూర్యుడిలో మాత్రం ఎనర్జీ నానాటికీ తగ్గుతోంది. అంటే సూర్యుడు బరువు తగ్గుతున్నట్లే. సూర్యుడు ప్రతి సెకండ్‌కీ 50 లక్షల టన్నుల బరువు తగ్గిపోతున్నాడు. అయినా ఇది సూర్యుడి బరువుతో పోల్చితే 0.01 శాతం మాత్రమే. అందువల్ల సూర్యుడి బరువు ఇప్పట్లో చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గదు. అందుకే, భూమి తిరిగే వేగంలో మార్పు ఉండట్లేదు. అందువల్ల సూర్యుడి నుంచి భూమి ఇప్పట్లో తప్పించుకునే ఛాన్స్ లేదు. అందువల్ల అది తిరుగుతూనే ఉంటుంది. 


500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడి లోపలి హైడ్రోజన్‌ పూర్తిగా అయిపోతుంది. దాంతో సూర్యుడిలోని ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది. సూర్యుడు విచ్చుకునే పువ్వులా..  పరిమాణం పెరిగిపోతుంది. దాంతో తనకు దగ్గర్లోని బుధ, శుక్ర గ్రహాలు సూర్యుడిలో కలిసిపోతాయి. ఆ సమయంలో సూర్యుడు ఇప్పటికన్నా 2300 రెట్లు అధికంగా ప్రకాశిస్తాడు. దాంతో భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి, జీవులన్నీ చనిపోతాయి. చివరకు భూమి కుతకుతా ఉడుకుతూ, లావా సముద్రంలాగా మారిపోతుందని శాస్త్రవేత్తల అంచనా.


ఇంకా ఈ విషయంలో మనకు చాలా ప్రశ్నలు సమాధానం లేకుండా ఉంటాయి. ఇదో పెద్ద సబ్జెక్ట్. దీని గురించి కొన్ని సంవత్సరాలపాటూ చర్చించుకోవచ్చు. అయినా చాలా ప్రశ్నలు, మిస్టరీగానే ఉంటాయి. 

Saturday, February 17, 2024

How a Whirlpool form? - వాయుగుండం (సుడిగుండం) ఎలా ఏర్పడుతుంది?

 


మనకు తెలుసు.. తుఫాను వచ్చే ముందు.. ద్రోణి ఏర్పడుతుంది. తర్వాత ఆవర్తనం, తర్వాత అల్పపీడనం ఏర్పడతాయి. క్రమంగా పీడనం పెరుగుతూ వాయుగుండం ఏర్పడుతుంది. మరింత బలపడి తుఫానుగా మారుతుంది. ఇదంతా జరగడానికి కనీసం 3 నుంచి 5 రోజులు పడుతుంది. ఇంతకీ సముద్రాల్లో ఈ సుడిగుండాలు, వాయుగుండాలు, టోర్నడో (Tornado)లు ఎలా ఏర్పడతాయి?


మీరు గమనించే ఉంటారు, రోడ్లపై అప్పుడప్పుడూ గాలి సుడిలా మారి.. రివ్వున ఒక చోటి నుంచి మరో చోటికి క్షణాల్లో వెళ్తుంది. గాలి అలా వెళ్లేటప్పుడు అక్కడున్న దుమ్ము, ఎండిన ఆకుల వంటివి గాలితోపాటూ.. గుండ్రంగా తిరుగుతూ వెళ్తాయి. ఈ సుడిగాలి మాగ్జిమం 5 సెకండ్లకు మించి ఉండదు. ఇదే విధంగా.. నీటిపై కూడా గాలి సుడిని ఏర్పరచగలదు. 


నీటిలో గాలి సుడిని ఏర్పరచినప్పుడు.. ఆ సుడిలో కొన్ని పదార్థాలు వేగంగా కదులుతాయి. మరికొన్ని నెమ్మదిగా కదులుతాయి. ఇలా నీటి అణువుల వేగంలో మార్పులుంటాయి. వేగంగా తిరిగే అణువులు.. ప్రత్యే పొరను ఏర్పాటుచేస్తాయి. నెమ్మదిగా తిరిగేవి మరో పొర ఏర్పాటు చేస్తాయి. ఇలా.. రకరకాల పొరలు ఏర్పడతాయి. ఈ క్రమంలో పొరల మధ్య వేడి (ఉష్ణోగ్రత)లో మార్పులు వస్తాయి. దాంతో.. కొన్ని పొరలు బరువు తక్కువగా, కొన్ని బరువు ఎక్కువగా మారతాయి. దీన్నే సాంద్రత అంటాం.


సాంద్రత ఎక్కువగా ఉన్న పదార్థాలు.. తక్కువ సాంద్రత ఉన్నవైపు ప్రవహిస్తాయి. ఈ క్రమంలో సుడిలో మార్పులు వస్తూ.. క్రమంగా వేగాల్లోనూ మార్పులు వస్తాయి. అదే సమయంలో ఈ సుడికి గాలి తోడవ్వడం వల్ల.. సుడి వేగం పెరుగుతుంది. అలా పెరుగుతూ పెరుగుతూ.. అదో ఆవర్తనంగా, అల్పపీడనంగా, వాయుగుండంగా, తుఫానుగా మారగలదు. ఈ తుఫాన్లు సముద్రంపై ఉన్నంతకాలం.. ఎక్కువ స్వేచ్ఛతో తిరుగుతాయి. అందుకే అవి బలపడుతుంటాయి. అవి భూమివైపు వచ్చాక, తీరం దాటాక.. ఆ సుడికి చెట్లు, ఇళ్ల వంటివి అడ్డు వస్తాయి. దాంతో సుడి రూపం చెదిరిపోతుంది. వేగం తగ్గిపోతుంది. క్రమంగా తుఫాను కాస్తా, వాయుగుండంగా, అల్పపీడనంగా మారి బలహీనపడిపోతుంది.

Why Rain drops are in round shape? - వాన చినుకులు గుండ్రంగా ఎందుకుంటాయి?

 


వానంటే మనందరికీ ఇష్టమే. వాన వచ్చే ముందు నల్లటి మేఘాలు ముసురుతాయి. చల్లటి గాలి వస్తుంది. దుమ్ము లేస్తుంది. అంతా చీకటిగా మారుతుంది. సరిగ్గా అప్పుడే టపటపా చినుకులు నేలపై పడతాయి. చల్లటి ఆ చినుకుల్లో తడుస్తుంటే, ఆదో ఆనందం. ఇలా ఎప్పుడో ఓసారి పడే వాన మనకు బాగా నచ్చుతుంది. చాలా మందికి వానలో తడవడం ఇష్టం ఉండదు. కానీ ఆ వాన పడటాన్ని చూడటం ఇష్టం. ఆ దృశ్యాన్ని మనసులో పదిలం చేసుకుంటారు. ఇంతకీ వాన చినుకులు గుండ్రంగా ఎందుకుంటాయి?


వాన నీరు అంటే.. ద్రవ పదార్థం. ఇలాంటి పదార్థాల ఉపరితలం సాగదీసిన పొరలాగా స్థితిస్థాపకత (elasticity) కలిగి ఉంటుంది. అలాగే బిగువు (tension) కూడా ఉంటుంది. దీన్నే తలతన్యత (surface tension) అంటారు. 


ద్రవాలకు స్వేచ్ఛ లభించినప్పుడు అణువులు నిరంతరం దగ్గరకు జరిగేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా అవి తక్కువ ప్రదేశంలో ఇరుక్కునేందుకు ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో ఆకారాలన్నింటిలోనూ, తక్కువ ఉపరితల వైశాల్యం ఉండేది.. గోళాకారానికే కావడంతో.. నీటి బిందువులు.. గోళాకారంలోకి మారుతాయి. 


మేఘాల్లో నీటి అణువులు చల్లదనం వల్ల దగ్గరకు జరుగుతాయి. దాంతో అవి నీటి బిందువుగా మారతాయి. బిందువుగా మారినప్పుడు వాటి బరువును భూమ్యాకర్షణ శక్తి ఆకర్షిస్తుంది. దాంతో ఆ చినుకులు భూమివైపు వస్తాయి. ఇలా వచ్చే సమయంలో ఆ నీటి చుక్కలకు స్వేచ్ఛ ఉంటుంది. దాంతో అవి.. సర్ఫేస్ టెన్షన్ పొందుతూ.. గుండ్రంగా మారతాయి. ఇలా వాన చినుకులే కాదు, పాల చినుకులు, పాదరసం (mercury), కూల్ డ్రింక్స్ రసాయనాల వంటివన్నీ గుండ్రంగానే మారతాయి. 

Friday, February 16, 2024

Why Sea water is saltish? - సముద్రపు నీరు ఉప్పగా ఎందుకుంటుంది?

 


సముద్రం మనందరికీ నచ్చుతుంది. ఎంతో విశాలంగా ఉంటుంది. ఆకాశం-నేల కలిసినట్లుగా కనిపిస్తుంది. కంటిన్యూగా అలలు వస్తూనే ఉంటాయి. చల్లని గాలి మనసును తాకుతుంది. ఇక ఆల్చిప్పలు, గులకరాళ్లూ రకరకాల ఆకారాలు, రంగులతో ఆకట్టుకుంటాయి. అదో అద్భుతమైన ప్రపంచం. అందుకే సముద్రం దగ్గరకు వెళ్లగానే మనమంతా చిన్న పిల్లలం అయిపోతాం. జలకాలాటలాడుతూ.. ఈ లోకాన్ని మర్చిపోతాం. అంతా బాగానే ఉన్నా, నదుల్లో లాగా.. సముద్ర నీరు తాగలేం. అవి ఉప్పగా ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా.


నిజానికి సముద్ర నీరు ఒకప్పుడు మంచినీరే. అప్పట్లో అందులో ఉప్పు ఉండేది కాదు. ఐతే.. భూమి నుంచి లవణాలతో కూడిన మంచి నీరు అంటే.. Ph 7.0 కంటే తక్కువ ఉండే నీరు, నదుల ద్వారా సముద్రంలో కలుస్తుంది. రోజూ ఈ నీరు ఆవిరి అవుతూనే ఉంటుంది. అందుకే సముద్రాలపై ఎక్కువగా మేఘాలు ఉంటాయి. తరచూ సముద్రాలపై అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు వస్తుంటే వాటి ద్వారా, భారీగా మేఘాలు భూమివైపు వస్తాయి. అవి భూమిపై వర్షాలు కురిపిస్తాయి. ఆ వర్షాల ద్వారా మళ్లీ నీరు నదుల్లోకి చేరి, అక్కడి నుంచి సముద్రాల్లో కలుస్తుంది. ఇలా రోజూ అన్ని సముద్రాల్లోకీ ఉప్పు చేరుతూనే ఉంటుంది. ఐతే.. ఈ ఉప్పు మేఘాలతో పైకి వెళ్లదు. ఇది సముద్రంలోనే ఉంటుంది. అందుకే సముద్రాలు నానాటికీ మరింత ఉప్పగా అవుతున్నాయి.


కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉప్పు చేరడంతో సముద్రాలు ఇప్పుడు చాలా ఉప్పగా ఉంటున్నాయి. సముద్రంలో Ph 7.0 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది 1 లీటర్ నీటిలో 35 గ్రాములు ఉంటుంది. సపోజ్ మీరు మార్కెట్‌లో కేజీ ఉప్పు కొంటే, దాని అర్థం మీకు ఆ ఉప్పు.. 30 లీటర్ల నీటిని ఆవిరి చెయ్యగా వచ్చిందని అర్థం.


నదుల్లో ఇలా ఎందుకు జరగదు?

నదుల నీటిలో కూడా ఉప్పు ఉంటుంది. అది చాలా తక్కువగా ఉంటుంది. భూమి పొరల్లోని ఉప్పు.. నదుల ద్వారానే సముద్రంలో కలుస్తుంది. నదులు ఈ ఉప్పును తమలో ఉంచుకోవు. అవి నిరంతరం ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తాయి కాబట్టి.. ఉప్పు రేణువులు కూడా నదుల నీటితో వెళ్లిపోతూ, సముద్రంలో చేరతాయి. ఆ తర్వాత అవి ఎక్కడికీ వెళ్లవు. అక్కడే ఉండిపోతాయి. అలా లక్షల సంవత్సరాలుగా ఉప్పు పెరుగుతూనే ఉంటుంది. 


Dead Sea (మృత సముద్రం):

పశ్చిమ ఆసియా లోని ఇజ్రాయెల్, జోర్డాన్, వెస్ట్ బ్యాంక్ దగ్గర మీరు డెడ్ సీని చూడవచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో కూడా ఇది కనిపిస్తుంది. ఇక్కడ సముద్రాల్లో కంటే 10 రెట్లు ఎక్కువగా ఉప్పు ఉంది. అందువల్ల ఇందులో మనిషి తేలగలరు. ఈ మృత సముద్రంలో చేపలేవీ బతకవు. ఈ సముద్రంలో బ్యాక్టీరియా తప్ప మరేదీ బతకట్లేదు.

Are Cell towers dangerous? - సెల్‌ టవర్లు మనకు ప్రమాదకరమా?

 


పల్లెలు పట్టణాలవుతున్నాయి. పట్టణాలు సిటీలవుతున్నాయి. సిటీలు మెట్రోలవుతున్నాయి. దాంతో టెక్నాలజీపై ఆధారపడటం పెరుగుతోంది. ఇదివరకు ఇంట్లో అందరికీ ఒకటే ల్యాండ్ ఫోన్ ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే, అంతమందికీ సెల్‌ఫోన్లు ఉంటున్నాయి. అందువల్ల సెల్ టవర్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. సిగ్నల్స్ బాగా రావాలంటే, సెల్ టవర్ల సంఖ్య ఎక్కువగా ఉండాల్సిందే. అందుకే కంపెనీలు ఇళ్ల మధ్యలో, ఆపార్ట్‌మెంట్లపై సెల్ టవర్లు ఏర్పాటుచేస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వానికీ, ఆ అపార్ట్‌మెంట్ వారికీ అద్దె చెల్లిస్తాయి. మరి అవి మనకు మంచివేనా?


మన దేశంలో ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలున్నారు. వారిలో పిల్లల సంఖ్య 40 కోట్ల దాకా ఉంది. ఆ లెక్కన పెద్దవారు ఒక్కొక్కరూ ఒక్కో మొబైల్ కలిగివుంటే మొత్తం వాడుకలో ఉన్న మొబైళ్ల సంఖ్య 100 కోట్లు ఉండాలి. కానీ ఇండియాలో ఇప్పుడు 120 కోట్ల దాకా మొబైళ్లు వాడుకలో ఉన్నాయి. అంటే మనుషుల సంఖ్య కంటే, మొబైళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కొంతమంది రెండేసి మొబైళ్లు వాడుతున్నారు. వాణిజ్య అవసరాల కోసం వాడే మొబైళ్లు కూడా ఉన్నాయి. 


ఒకప్పుడు సెల్‌ఫోన్లు ఉండటమే గొప్ప. ఇప్పుడు అంతా స్మార్ట్ యుగం. స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది. కాల్స్ కోసమే కాకుండా, చాటింగ్, మనీ చెల్లింపులు, ఆన్‌లైన్ బుకింగ్స్, వీడియో వాచింగ్, ఇలా దాదాపు 100 రకాల అవసరాలకు మొబైల్స్ పనిచేస్తున్నాయి. 4G నుంచి 5Gకి వచ్చేశాం. త్వరలో 6G కోసం ఏర్పా్ట్లు చేస్తున్నారు. ఈ మొబైల్స్ విద్యుత్ అయస్కాంత తరంగాలను వాహకాలుగా చేసుకుంటూ, ఎలక్ట్రానిక్స్‌ మాడ్యులేషన్ల పద్ధతిలో పనిచేస్తున్నాయి.


ఎలా పనిచేస్తాయి?

మీకో డౌట్ వచ్చే ఉంటుంది. ఎన్ని కోట్ల మొబైల్స్ ఉన్నా, మనం ఎవరికి కాల్ చేస్తామో, వారికే కాల్ వెళ్తుంది. ఎవరికి మనీ చెల్లిస్తామో, వారికే మనీ వెళ్తుంది. అంత పర్ఫెక్టుగా వెళ్లడానికి కారణం టెక్నాలజీ. సుమారు 800 కిలోహెర్ట్జ్‌ నుంచి సుమారు 3 గిగాహెర్ట్జ్‌ ఉన్న సూక్ష్మ తరంగాల్ని సెల్‌ఫోన్ టవర్ల ద్వారా ఒక సెల్‌ఫోన్ నుంచి మరో సెల్‌ ఫోన్‌కి పంపిస్తారు. ఈ తరంగాలు పర్ఫెక్టుగా వెళ్తాయి. 


టవర్లు ప్రమాదకరమా?

మన నిత్య జీవితంలో సెల్‌ఫోన్ టవర్లు అత్యంత ముఖ్యమైనవి. అవి లేకపోతే మన ప్రపంచం పనిచేయదు. కమ్యూనికేషన్ మొత్తం ఆగిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం మొబైల్ టవర్ల వల్ల, వాటి చుట్టుపక్కల ఉన్న ప్రజలకూ, పక్షులకూ అంతగా హాని లేదు. కానీ సెల్‌ఫోనును ఎక్కువ సేపు వాడటం మనకు మంచిది కాదు. దాని వల్ల ఉత్పత్తి అయ్యే వేడి వల్ల మన తలకు సమస్యలు రావచ్చు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. సెల్‌ఫోన్ రేడియేషన్ వల్ల మెదడు క్యాన్సర్ వస్తుందనే ప్రచారం ఉన్నా, దీనికి ఆధారాలు లేవు. అయితే, అతిగా వేడెక్కే మొబైల్ బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎక్కువ సేపు మొబైల్ మాట్లాడకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Vitamin Tablets Good or Bad? - విటమిన్ మాత్రలు మంచివేనా?

 


ఈ రోజుల్లో చిన్న అనారోగ్యం వచ్చినా మందులు వాడటం మనకు అలవాటైపోతోంది. తలనొప్పి, కడుపునొప్పి, జలుబు, గొంతునొప్పి ఇలా ఏది వచ్చినా, ఇంట్లో వాళ్లు టాబ్లెట్ వేసుకో అని ఎంకరేజ్ చెయ్యడం, సరేలే అని మనం వేసేసుకోవడం కామనైపోతోంది. ఒంట్లో బాలేదని ఎవరికైనా చెప్పగానే.. టాబ్లెట్స్ వేసుకో అనో డాక్టర్ దగ్గరకు వెళ్లు అనో చెప్పేస్తున్నారు. మంచి సలహా ఇచ్చామని వారు అనుకుంటున్నారు. మరి ఇది మంచిదేనా? ప్రతిదానికీ మాత్రలు వాడేయొచ్చా? ముఖ్యంగా విటమిన్ టాబ్లెట్స్ వాడటం ఆరోగ్యానికి మేలేనా?


రూల్ ప్రకారం మనం ఏ మందులు వాడాలన్నా, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఉండి తీరాలి. కానీ మన దేశంలో చట్టాలు పూర్తిగా అమలుకావు. అందువల్ల ప్రజలు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. తమకు ఏ టాబ్లెట్లు కావాలో వారు డిసైడ్ చేసుకుంటారు. అలాగే మందుల షాపుల్లో కూడా, ఏ నొప్పికి మందు అడిగినా, వెంటనే ఇచ్చేస్తారు. ఇదంతా రొటీన్‌గా జరుగుతున్నదే. ఇక విటమిన్ టాబ్లె్ట్ల పరిస్థితి వేరు. వాటిలో చాలా కంపెనీలున్నాయి. వాటి గురించి మనకు ఏమీ తెలియకపోయినా, మందుల షాపులో వాళ్లు ఇస్తే, మనం వాడతాం. అవి మంచివా, కావా అన్నది ఆలోచించేంత టైమ్ మన దగ్గర ఉండదు. షాపుల వాళ్లు అవి మంచివని చెబితే, నమ్ముతాం.


సాధారణంగా విటమిన్ టాబ్లెట్లు రకరకాల రూపాల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరికీ అన్ని రకాల విటమిన్లూ అవసరం లేదు. వారికి కొరత ఉన్న విటమిన్లు మాత్రమే వారు మాత్రల రూపంలో పొందడం మేలు. కానీ విటమిన్ మాత్రల్లో, చాలా రకాల విటమిన్లు కలిసి ఉంటాయి. అందువల్ల ఈ మాత్రలతో అవసరమైన విటమిన్లతోపాటూ, అవసరం లేని విటమిన్లు అధికంగా పొందే ప్రమాదం ఉంటుంది.


పిల్లలు, గర్భిణీలు, ముసలివారు, కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు.. విటమిన్ మాత్రలు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎందుకంటే, వారికి కొన్ని విటమిన్లు సమస్యగా మారగలవు. డాక్టర్ చెప్పిన టాబ్లెట్లు మాత్రమే వాడాలి. మందుల షాపుల వాళ్లను కూడా ఆ టాబ్లెట్లే ఇవ్వమని అడగాలి. వేరేవి ఇస్తే, తీసుకోకూడదు. 


సహజంగానే విటమిన్లు:

అన్నింటికంటే ఉత్తమ విధానం విటమిన్ల కోసం సహజ పద్ధతులను అనుసరించడం. ఉదయం, సాయంత్రం వేళ ఎండలో అరగంట చొప్పున ఉంటే, D విటమిన్ లభిస్తుంది. ఆకుకూరల్లో A, B, E, K విటమిన్లు ఎక్కువగా లభిస్తాయి. పండ్లలో C విటమిన్ బాగా లభిస్తుంది. కాబట్టి ప్రతీ వారం అన్ని రకాలూ కలగలిసిన ఆహారం తినాలి.


ఇలా తింటే మేలు:

మాంసాహారులు వారానికి 2 సార్లు మాంసం, 2సార్లు గుడ్లు తినవచ్చు. అలాగే పప్పులు, కూరగాయలు, ఆకుకూరలూ తప్పనిసరిగా తినాలి. ఇంకా పండ్లు, డ్రై ఫ్రూట్స్, గింజల వంటివి కూడా తప్పక తీసుకోవాలి. 


శాఖాహారులు వారానికి 3సార్లు కందిపప్పు తీసుకోవాలి. తద్వారా వారికి ప్రోటీన్స్ లభిస్తాయి. అలాగే పండ్లలు, కూరగాయలు, పప్పులు, బద్దలు, గింజలు, డ్రైఫ్రూట్స్, తృణ ధాన్యాల వంటివి అన్నీ క్రమం తప్పకుండా తీసుకోవాలి.


ఆహారంతోపాటూ, రెగ్యులర్‌గా వాకింగ్, జాగింగ్ వంటివి లేదా ఇంటి పనుల వంటివి చేస్తూ ఉంటే, బాడీలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. తద్వారా ఆరోగ్యంగా ఉంటారు.

Wednesday, February 14, 2024

Durien Fruit: పీల్చితే కంపు వాసన, తింటే రుచి అమోఘం. ఈ పండు తీరే వేరు!


మనం ఇండియాలో పనసపండ్లను ఆసక్తిగా తింటాం. వాటి రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటిదే తూర్పు ఆసియా దేశాల్లో డ్యురియన్ అనే పండు ఉంటుంది. ఇది విపరీతమైన కంపు కొడుతుంది. ఆ వాసన మనం భరించలేం. అందుకే ఈ పండు తినాలంటే చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతారు. కానీ పండు రుచి బాగుంటుంది. ఈ పండ్లలో దాదాపు 30 రకాల జాతులున్నాయి. వాటిలో 9 రకాల జాతుల పండ్లను తినవచ్చు. ఇండొనేసియాలోని సుమత్రా దీవుల్లో ఈ పండ్లను మొదట కనుక్కున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఈ పండ్లు లభిస్తున్నాయి.


మన దగ్గర పండ్లలో రారాజుగా మామిడిని చెబుతాం. తూర్పు ఆసియా దేశాల్లో డ్యురియన్ పండ్లను రారాజుగా చెబుతారు. ఈ పండ్లు ఒక్కొక్కటీ దాదాపు 3 కేజీల బరువు పెరుగుతాయి. ఈ పండు, కుళ్లిపోయిన ఉల్లిపాయ వాసన వస్తుంది. అందువల్లే చాలా మంది కడుపులో తిప్పినట్లు ఫీలవుతారు. ఇంకా చిత్రమేంటంటే.. మీరు ఈ పండును ఇంటికి తెచ్చి, తిరిగి ఎక్కడికైనా పట్టుకెళ్లినా, మీ ఇంట్లో ఈ పండు వాసన కొన్ని రోజులపాటూ ఉంటుంది. అందుకే ఈ పండును హోటళ్లు, ప్రజా రవాణా వాహనాల్లో తీసుకెళ్లనివ్వరు. ఈ పండును తీపి పదార్థాల్లో వాడతారు. లోపలి గింజలను కూడా ఉడకబెట్టి తింటారు. 


రుచి ఎలా ఉంటుంది?

ఈ పండు చాలా రుచికరంగా ఉంటుంది. తీపి రుచి ఉంటుంది. మెత్తమెత్తగా సీతాఫలం తరహాలో ఉంటుంది. కారామెల్, వెనీలా, చీజ్ కేక్ రుచి కలిగివుంటుంది. 


ధర ఎంత?

ఇప్పుడు డ్యురియన్ పండ్లను ఇండియాలో కూడా సాగు చేస్తున్నారు. మీరు వీటిని ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో కొనవచ్చు. ఒక పండు ధర రూ.200 దాకా ఉంటుంది.


When will the Earth run out of energy? - భూమిలో శక్తి ఎప్పుడు అయిపోతుంది?


 కొన్ని ప్రశ్నలు చాలా ఆసక్తి కలిగించడమే కాదు.. ఆలోచన కలిగిస్తాయి కూడా. ఇది అలాంటిదే. ఎందుకంటే, మన మొబైల్లో బ్యాటరీ 2 లేదా 3 రోజుల్లో అయిపోతుంది. మళ్లీ మనం ఛార్జ్ చేసుకుంటాం. అలాగే వాల్ క్లాక్‌లో బ్యాటరీ 1 సంవత్సరంలో అయిపోతుంది. బైక్‌లో బ్యాటరీ 3 ఏళ్లలో అయిపోతుంది. ఇలా ప్రతీ దానికీ ఎనర్జీ అయిపోయే టైమ్ ఉంటుంది. మరి భూమి సంగతేంటి? భూమిలో ఎనర్జీ ఎప్పుడు అయిపోతుంది? అనే ప్రశ్న మీరు ఎప్పుడైనా ఆలోచించారా?


మన భూమిలోపల బొగ్గు, చమురు, పెట్రోలియం, గ్యాస్ వంటివి లభిస్తాయని మనకు తెలుసు. ఇవన్నీ భూమిలో ఎలా తయారవుతాయో తెలుసా? మొక్కలు, చెట్లు, చేపల వంటివి చనిపోయాక, వాటిపై ఇసుక పేరుకుపోయి వాటిని బలంగా నొక్కేస్తుంది. ఇలా కొన్ని వందల సంవత్సరాలు అయ్యేటప్పటికి, అవి శిలాజ ఇంధనాలు (fossil fuels)గా మారి, ప్రత్యేక పొరలా ఏర్పడతాయి. ఆ పొరను తవ్వి తీస్తారు. అదే చమురు, పెట్రోలియం రూపంలో వస్తుంది. దానితోనే దాదాపు 6000 రకాల ఉత్పత్తులను తయారుచేస్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, బొగ్గు వంటివి అందులోంచీ వచ్చేవే. వాటి కోసం రోజూ కొత్త కొత్త ప్రదేశాల్లో తవ్వుతూ, నిల్వలు ఉన్నాయేమో అని చూస్తూనే ఉన్నాయి ప్రపంచదేశాలు.


గల్ఫ్ దేశాల్లో చమురు ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అందుకు కారణం మనం చెప్పుకున్నదే. ఇప్పుడు గల్ప్ దేశాలు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు సముద్రం ఉండేది. దాంతో చాలా జీవులు, మొక్కల వంటివి సముద్రంలోని ఇసుకలో సమాధి అయ్యాయి. వాటిపై ఇసుక పేరుకుపోయింది. కాలక్రమంలో సముద్రం ఎండిపోయి, గల్ఫ్ దేశాలు ఎడారిలా మారాయి. ఇప్పుడు ఆ ఇసుకలో తవ్వితే, శిలాజ ఇంధనాలైన చమురు, గ్యాస్ వంటివి లభిస్తున్నాయి. మన కృష్ణా, గోదావరి బేసిన్‌లో కూడా ఇదే జరుగుతోంది.


భూమి లోపల నుంచి తవ్వితీస్తున్న శిలాజ ఇంధనాల స్థానంలో ఇసుకతో పూడ్చుతారు. ఇలా రోజూ ప్రపంచవ్యాప్తంగా వేల టన్నుల శిలాజ ఇంధనాలను తీస్తూనే ఉన్నారు. అందువల్ల కొన్నేళ్ల తర్వాత ఈ ఇంధనాలు అయిపోతాయనే అభిప్రాయం ఉంది. ఓ అంచనా ప్రకారం 2060 నాటికి ఇవి పూర్తిగా అయిపోతాయి. అప్పుడు మనకు పెట్రోల్, డీజిల్ ఉండకపోవచ్చు.


ఈ కారణంగానే ప్రపంచ దేశాలు ఇప్పుడు సోలార్, విండ్ ఎనర్జీపై ఫోకస్ పెట్టాయి. భవిష్యత్తులో భూమిలో ఎనర్జీ అయిపోతే, అప్పుడు సూర్యుడి ఎండని, సోలార్ పవర్ రూపంలో ఎక్కువగా వాడుకోక తప్పదు. ఇండియా, చైనా, అమెరికా సహా చాలా దేశాలు ఇప్పుడు దీనిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. 

Butterfly has no skeleton? - సీతాకోకచిలుకకి అస్థిపంజరం వుండదా?


 సీతాకోకచిలుక జీవితం ఆశ్చర్యకరం. గొంగళిపురుగు గూడు కట్టుకొని నిద్రపోవడం, ఆ తర్వాత దానికి రెక్కలు వచ్చి, సీతాకోకచిలుకగా మారడం అంతా ప్రకృతి చిత్రం. మనలో చాలా మంది గొంగళిపురుగును చూసి భయపడతారు. దూరంగా వెళ్లిపోతారు. కానీ సీతాకోకచిలుక మాత్రం అందరికీ నచ్చుతుంది. దాని కలర్స్, రెక్కలు ఆకట్టుకుంటాయి. ఐతే.. సీతాకోకచిలుకకు సంబంధించి మనం మరో ఆసక్తికర విషయం చెప్పుకోవచ్చు. అదేంటంటే, వాటికి అస్థిపంజరం ఉండదు.


ఎముకలు లేకుండా మనం ఉండగలమా? మనం ఏం చెయ్యాలన్నా ఎముకలు ఉండాల్సిందే. మన శరీరంలోని ప్రతీ పార్టుకీ ఎముకలు కీలకం. అలాంటిది సీతాకోకచిలుకకు ఎముకే ఉండదంటే నమ్మడం కష్టం. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది.


మనిషి చనిపోతే, ఎముకలు మిగులుతాయి. మిగతా శరీరం అంతా మట్టిలో కలిసిపోతుంది. అదే సీతాకోక చిలుక విషయంలో రివర్స్. అవి చనిపోతే, వాటి బాడీ అలాగే ఉంటుంది. చనిపోయి ఉన్న సీతాకోక చిలుకను మీరు ఓ సీసాలో ఉంచితే, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. దాని బాడీ, రెక్కలు అలాగే ఉంటాయి. కారణం దాని అస్థిపంజరం ప్రత్యేకమైనది. దాన్ని అనెక్సోస్కెలెటన్ (anexoskeleton) అంటారు. ఇది బలమైన అస్థిపంజరం. అలాగని దీన్లో ఎముకలు మాత్రం ఉండవు. 


ఈ ప్రత్యేక అస్థిపంజరంతో సీతాకోక లాంటి జీవులు శ్వాసక్రియ, విసర్జన క్రియ జరిపేందుకు వీలుగా కన్నాలు ఉంటాయి. ఈ తరహా అస్థిపంజరం రొయ్యలు, పీతలకు కూడా ఉంటుంది. ఇకపై మీరు ఎప్పుడైనా సీతాకోకచిలుకను చూస్తే, ఈ విషయం గుర్తు చేసుకోండి. అప్పుడు మీ అబ్జర్వేషన్ మరింత నిశితంగా ఉంటుంది.


Can we use Lemons as battary? - నిమ్మకాయలు బ్యాటరీలలా పనిచేస్తాయా?

 


ఈ రోజుల్లో బ్యాటరీల వాడకం బాగా పెరిగింది. మొబైల్, క్లాక్, ఇంట్లోని చాలా ఎలక్ట్రిక్ గాడ్జెట్స్‌కి మనం బ్యాటరీలు ఉపయోగిస్తూ ఉంటాం. ఐతే, ఈ బ్యాటరీలు ఎలా తయారవుతాయి అనేది మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. జింకు, రాగి (Copper) లాంటి వేర్వేరు సన్నని లోహపు పలకలను (ఎలక్ట్రోడ్లు), సజల సల్ఫ్యూరిక్‌ ఆమ్లము (Aqueous sulfuric acid) (ఎలక్ట్రోలైట్‌) ఉండే పాత్రలో దూరం దూరంగా ఉంచి, వాటి మధ్య చిన్న కరెంటు బల్బును రాగి తీగ (copper wire)తో లింక్ చేస్తారు.  దీన్నే విద్యుత్‌ ఘటం (electric cell) అంటారు. ఇలా కొన్ని విద్యుత్‌ ఘటాలను లింక్ చేయడమే బ్యాటరీ. ఇందులో ఏం జరుగుతుందంటే.. రెండు వేర్వేరు లోహాల మధ్య కరెంటు ప్రవహిస్తుంది.


నిమ్మకాయతో ఎలా?

ఒక నిమ్మకాయలో ఒక ఇనుము (Iron) లేదా జింకు మేకును ఉంచాలి. కొంత దూరంలో ఒక రాగి నాణాన్ని (copper coin) గుచ్చి, వాటి మధ్య రాగి తీగ (copper wire) సెట్ చేసి, ఆ తీగకు ఒక చిన్న బల్బును పెట్టి నిమ్మకాయను గట్టిగా పిండితే బల్బు వెలుగుతుంది. 


ఎలా వెలుగుతుంది?

బ్యాటరీ లేకుండా బల్బు ఎలా వెలుగుతుంది అనే ప్రశ్న మనకు వస్తుంది. ఈ ప్రయోగంలో నిమ్మకాయలోని రసం (juice) ఎలక్ట్రోలైట్‌ లాగా పనిచేస్తుంది. అలాగని మనం నిమ్మకాయలతో కరెంటు ఉత్పత్తి చేసుకుందామనుకుంటే కుదరదు. ఎందుకంటే నిమ్మకాయ కావాల్సినంత కరెంటును ఇవ్వలేదు. అందువల్ల బల్బు సరిగా వెలగదు. కాంతి తక్కువగా ఉంటుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. నిమ్మకాయల సంఖ్య పెరిగే కొద్దీ బల్బు కాంతి పెరుగుతుంది. 5 నిమ్మకాయలను రాగి తీగ (copper wire) ద్వారా కలిపితే బల్బు బాగా వెలుగుతుంది. అంటే ఇక్కడ నిమ్మకాయలు ఎలక్ట్రిక్‌ బ్యాటరీల లాగా పనిచేస్తాయి.


గమనిక: ఈ నిమ్మకాయ ప్రయోగాన్ని పిల్లలు ఒంటరిగా చెయ్యకూడదు. నిపుణుల సమక్షంలో మాత్రమే చెయ్యాలి. 

Do Fish Sleep? - చేపలు నిద్రపోతాయా?

 


మీరు చేపల్ని ఎప్పుడైనా గమనించారా.. అవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. రాత్రైనా, పగలైనా ఒక్క క్షణం కూడా అవి కదలకుండా ఉండవు. ఏవో కొన్ని చేపలు తప్పితే, మాగ్జిమం చేపలన్నీ కదులుతూనే ఉంటాయి. పైగా వాటి కళ్లకు రెప్పలు ఉండవు. అందువల్ల వాటిని ఆక్వేరియంలో చూసినప్పుడు, ఇవి నిద్రపోవా అనే డౌట్ మనకు వస్తుంది. దానికి ఆన్సర్ తెలుసుకుందాం.


సమాధానం తెలుసుకునేముందు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. నిద్రపోవాలంటే కళ్లకు రెప్పలు ఉండాలనీ, అవి మూతపడాలని రూలేమీ లేదు. ఈ సృష్టిలో అన్ని జీవులూ ఒకేలా ఉండవు. అలాగే వాటి జీవన శైలి కూడా ఒకేలా ఉండదు. ఉదాహరణకు సాలెపురుగుకి తలలోనే కాదు.. బాడీలో కూడా కళ్లుంటాయి. మొత్తం 8 కళ్లు ఉంటాయి. బల్లికి తన తోక కట్ అయినా ఏమీ కాదు. పిల్లి 20 అంతస్థుల పైనుంచి కింద పడినా ఏమీ కాదు. ఇలాగే చేపలు కూడా కనురెప్పలు లేకపోయినా, నిద్రపోగలవు.


చేపలు రోజూ ఎంతో కొంత సేపు నిద్రపోతాయి. కొన్ని చేపలు పగటివేళ నిద్రిస్తే, మరికొన్ని రాత్రిపూట నిద్రిస్తాయి. మీరు దీన్ని చూడవచ్చు కూడా. ఇళ్లలోని ఆక్వేరియంలో చేపలు రాత్రివేళ పెద్దగా కదలికలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే అవి ఆ సమయంలో నిద్రపోతూ ఉంటాయి. 


సముద్రాల్లో చేపలు నిద్రపోయే సమయం రాగానే, నీటిలోతుల్లో ఉండే గుహల్లోకీ, పగడపు దిబ్బల్లోకీ వెళ్తాయి. అక్కడి మట్టిని తమ ఒంటిపై వేసుకొని, నిద్రపోతాయి. దాంతో అక్కడో చేప ఉందనీ, నిద్రపోతోందనీ ఇతర జీవులకు తెలియదు. ఒకవేళ ఇతర జీవులు కనిపెట్టి.. పట్టుకుందామని వచ్చినా, చేపలు చూడగలవు. అవి నిద్రపోయినా, పూర్తిగా నిద్రపోవు. స్పృహలోనే ఉంటాయి. అందువల్ల చిన్న అలికిడి అయినా, ఇట్టే నిద్రలేస్తాయి. నిద్ర సమయంలో చేపలు చురుగ్గా ఉండవు. కానీ నిద్రలేవగానే ఫుల్ యాక్టివ్‌గా ఉంటాయి. నిద్రపోతూ కూడా చేపలు ఈదుతూనే ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

How Birds migrate? పక్షులు ఎలా వలస వెళ్తాయి?

 


మీరు తరచుగా గమనించే ఉంటారు, ఆకాశంలో గుంపులుగా పక్షులు వెళ్లిపోతూ ఉంటాయి. ముఖ్యంగా కొంగల లాంటివి V ఆకారంలో ఎగురుతూ వెళ్తుంటాయి. అవి చాలా దూరం నుంచి వస్తూ ఉంటాయి. అలాగే అవి చాలా దూర ప్రదేశాలకు వెళ్తుంటాయి. ఇలాంటి పక్షులు విదేశాల నుంచి వస్తుంటాయి. వీటిని మనం వలస పక్షులు అంటుంటాం. వీటిలో కొన్ని రష్యాలోని సైబీరియా నుంచి, మన దేశానికి వచ్చే పక్షులు కూడా కొన్ని ఉంటాయి. ఆ పక్షులు ఇండియాలో 3 నుంచి 4 నెలలు ఉంటాయి. తిరిగి తమ స్వదేశాలకు వెళ్లిపోతాయి. ఎక్కువగా చలికాలం వచ్చినప్పుడు ఈ పక్షులు భారత్ వస్తుంటాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఈ పక్షులకు దారి ఎలా తెలుసు? ఎలా అవి అత్యంత కచ్చితత్వంతో చేరాలనుకున్న చోటికి చేరుతున్నాయి? వేల కిలోమీటర్లు ఎగురుతూ వచ్చినా, అవి దారి తప్పకుండా ఎలా గమ్యానికి చేరగలుగుతున్నాయి?


భూమిపై ఉండే నదులు, సముద్ర తీరాలు, పర్వతాల వంటి వాటిని పక్షులు గుర్తు పెట్టుకుంటాయి. ఈ వలస పక్షుల తలలో మాగ్నటైట్‌ (Magnetite) అనే సూక్ష్మకణాలు ఉంటాయి. ఈ మాగ్నటైట్.. పేరుకు తగినట్లే, అయస్కాంతంలా పనిచేస్తుంది. అందువల్ల ఈ పక్షులు భూ అయస్కాంత క్షేత్రాన్ని కనిపెట్టగలవు. దానికి అనుగుణంగా అవి ఎగురుతూ వెళ్తాయి. అలా వెళ్తూనే పర్వతాలు, నదులు, సముద్రాలు, సూర్యుడు, నక్షత్రాలను గమనిస్తూ ఆ పక్షులు ముందుకెళ్తాయి. అయస్కాంత క్షేత్రంపై ఆధారపడతాయి కాబట్టే, ఈ పక్షులు ఏమాత్రం దారి తప్పవు. 


ఎలా ఎగురుతాయి?

ఎక్కువ దూరం వలస వెళ్లే పక్షులు అలసిపోకుండా వందల మైళ్లు ప్రయాణించేందుకు ఓ టెక్నిక్ ఉపయోగిస్తాయి. ఇలా ఎగిరే పక్షులు రివర్స్ V (^) ఆకారంలో ఎగురుతాయి. వీటిలో ముందు ఎగిరే పక్షులు గాలిని చీల్చుతూ, బలంగా ఎగరాల్సి వస్తుంది. తద్వారా అవి గాలి ఒత్తిడిని పక్కకు పంపిస్తాయి. దాంతో వెనక ఎగిరే పక్షులకు అంత ఒత్తిడి ఉండదు. అవి తేలిగ్గా ఎగరగలుగుతాయి. ఐతే.. ముందు ఎగిరే పక్షులు, కొంత దూరం వెళ్లాక.. పొజిషన్ మార్చుకొని వెనక్కి వస్తాయి. వెనక ఉన్న పక్షులు ముందుకు వెళ్తాయి. ఇలా ఈ పక్షులు, చక్కగా సహకరించుకుంటూ, గుంపుగా ఎగురుతాయి. ఐకమత్యమే మహా బలం అని చెప్పేందుకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.

Tuesday, February 13, 2024

Why Dal not boil if you add salt - ఉప్పు వేస్తే, పప్పు ఎందుకు ఉడకదు?


మన ఇళ్లలో కూరలు వండేటప్పుడు, నూనె వేగిన తర్వాత, ఉల్లిపాయ ముక్కల్ని వేపుతారు. తర్వాత టమాటా ముక్కలు వేసినప్పుడు, ఉప్పు కూడా వేస్తారు. తద్వారా టమాటా ముక్కలు త్వరగా ఉడుకుతాయని అంటారు. ఇదే ఫార్ములా పప్పు విషయంలో రివర్సులో ఉంటుంది. పప్పులను ఉడికించేప్పుడు మొదట్లోనే ఉప్పు వెయ్యరు. అలా వేస్తే పప్పు త్వరగా ఉడకదు అంటారు. ఉప్పు వేస్తే, పప్పు ఎందుకు ఉడకదు అనే ప్రశ్న మీకు ఎదురయ్యే ఉంటుంది.


సమాధానం ఇదే:

పప్పులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే పిండి పదార్థం. అలాగే మాంసకృత్తులు కూడా ఉంటాయి. అంటే ప్రోటీన్లు. అందువల్ల కందిపప్పు లాంటి వాటిని నీటిలో ఉడికించేటప్పుడు వాటిలోని పిండిపదార్థం త్వరగానే ఉడుకుతుంది. కానీ మాంసకృత్తులు మాత్రం త్వరగా ఉడకవు. 


ఉడకడం అంటే ఏంటి?

ఇక్కడ మనం ఉడకడం అంటే ఏంటి అనేది కూడా మాట్లాడుకోవాలి. ఉడకడం అంటే పొడవైన ప్రోటీను అణువులు చిన్న చిన్న ముక్కలుగా అవ్వడమే. ఇవి ముక్కలైనప్పుడు మన కడుపులో సులభంగా అరిగిపోతాయి. ఇలా ఇవి ముక్కలవ్వడం అనేది, నీటి వల్ల వీలవుతుంది. ఇలా ప్రోటీన్ అణువులు ముక్కలవడాన్ని జలవిశ్లేషణం (hydrolysis) అంటారు. 


ఉప్పు వేస్తే ఏమవుతుంది?

మీరు పప్పును ఉడికించేటప్పుడు, నీటిలో ఉప్పు వేస్తే, ప్రోటీన్లు త్వరగా ముక్కలవ్వవు. అందువల్ల అవి ముక్కలవ్వడానికి ఎక్కువ సేపు ఉడికించాల్సి ఉంటుంది. దాని వల్ల గ్యాస్ వేస్ట్ అవుతుంది. అందుకే పప్పును ఉడికించేటప్పుడు ముందుగా ఉప్పు వెయ్యరు. మొత్తం ఉడికిన తర్వాతే సరిపడా ఉప్పు వేసుకుంటారు.


 

Why Blood is red? రక్తం ఎందుకు ఎర్రగా ఉంటుంది?


మనందరికీ రక్తం ఉంటుంది. అది ఎర్రగా ఉంటుంది. కానీ ఈ భూమిపై కొన్ని జీవులకు రక్తం ఎర్రగా ఉండదు. బొద్దింక, ఐస్ ఫిష్ వంటి వాటికి రక్తం తెల్లగా ఉంటుంది. మరి మనుషులకు ఎందుకు ఎర్రగా ఉంటుంది అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు.


రక్తము ద్రవ రూపంలో ఉండే కణజాలముల సమూహం. ఇందులో ప్లాస్మా, ఇతర అనేకరకాల కణాలు ఉంటాయి. రక్తంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనేవి కీలకమైనవి. వీటిలో ఎర్ర రంగులో ఉండే రక్త కణాలు ఒక మనిషి రక్తంలోని ప్రతి చుక్కలో 30 కోట్ల వరకూ ఉంటాయి. ఈ రక్త కణాలలో "హిమోగ్లోబిన్‌" అనే ఎరుపు రంగు పదార్థం ఉంటుంది. అందువల్లే రక్తం ఎరుపు రంగులో కనిపిస్తుంది. 


ఎర్ర రక్త కణాలు, మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్‌‌ని తమలో నింపుకుంటాయి. ఈ కణాలు శరీరంలోని అన్ని భాగాలకూ చేరేలా ఐరన్ ప్రోత్సహిస్తుంది. దాంతో ఎర్ర రక్త కణాలు, శరీరంలోని అన్ని భాగాలకూ చేరతాయి. దాంతో ఈ కణాల నుంచి ఆక్సిజన్.. శరీరం మొత్తానికీ చేరుతుంది. 


వెన్నెముక లేని జీవులలో రక్తం ఎర్రగా ఉండదు. నీలి (blue), తెలుపు రంగులో ఉంటుంది. కారణం ఆ జీవుల రక్తంలో ఉండే పదార్థం ఎరుపు కాకుండా వేరే రంగులో ఉండటమే. హిమోగ్లోబిన్‌ ఉన్న రక్తం మాత్రమే ఎర్రగా ఉంటుంది. నీలి, తెలుపు రంగు రక్తం ఉండే జీవులలో హిమోగ్లోబిన్ ఉండదు. 

Monday, February 12, 2024

కొత్తిమీర, పుదీనా, కసూరి మేతితోపాటూ.. కిచెన్‌లో ఇది కూడా ఉంచుకోండి


Oregano Health Benefits: ఒరెగానో అనేది ఓ చిన్న సైజు మొక్క. ఇది ఎంత మంచిదంటే, దీనికి అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. చక్కటి సువాసనతోపాటూ, రోగాల్ని నయం చేసే శక్తి దీని సొంతం. ఒరెగానోలో 40కి పైగా రకాలున్నాయి. వాటిలో ఒరిగానమ్ వల్గారే (Origanum vulgare) అత్యంత శక్తిమంతమైనది. పశ్చిమ ఆసియాలో పెరిగే ఈ మొక్క, తాజా ఆకులు లేదా ఎండిన ఆకుల్ని, చికెన్, మటన్, ఆకుకూరలు, అన్ని రకాల వంటల్లోనూ వాడితే, మంచి ఫ్లేవర్‌తోపాటూ, రోగాలకూ చెక్ పెట్టినట్లవుతుంది. ఇదే ఒరెగానో ఆకుల నుంచీ తైలం (నూనె లేదా ఆయిల్) కూడా తీస్తున్నారు. దాన్ని కూడా రకరకాల రోగాలు నయం చేసేందుకు వాడుతున్నారు. ఇప్పుడీ మొక్క కావాలంటే మనం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో ఈ మొక్కల ఎండిన ఆకులు, తైలాన్ని అమ్ముతున్నారు. 


ఒరెగానోతో ఆరోగ్య ప్రయోజనాలు

ఒరెగానో ఆకులు 23 రకాల చెడు బ్యాక్టీరియాతో పోరాడతాయి. కూరల్లో, ఫ్రైలలో ఈ ఆకుల్ని కొద్దిగా వేసుకుంటే చాలు, ఇవి శరీరంలో విష వ్యర్థాలను తరిమేస్తాయి. ఈ ఆకుల పొడిని పిజ్జాలపై కూడా చల్లుకుంటారు.


మన చర్మ కణాల్ని కాపాడే శక్తి ఈ ఆకులకు ఉంది. వీటిలో ఫైబర్, విటమిన్ K, మాంగనీస్, ఐరన్, విటమిన్ E, ట్రైప్టోఫాన్, కాల్షియం ఉన్నాయి. అందువల్ల ఇవి మనకు ఎంతో ఆరోగ్యకరం.


కాన్సర్, గుండె జబ్బుల అంతు చూసే ఈ ఆకుల వల్ల మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. వీటిలో కేలరీలు చాలా తక్కువ.


ఎండిన ఆకుల్ని గాజు సీసాల్లో నిల్వ చేసుకోవాలి. కాలం గడిచే కొద్దీ సువాసన తగ్గినా, హెల్త్ పరంగా కలిగే ప్రయోజనాలు మాత్రం అలాగే ఉంటాయి.


గొంతు గరగరగా ఉన్నా, జీర్ణక్రియ సరిగా లేకపోయినా, వికారంగా ఉన్నా, ముక్కు దిబ్బడ ఉన్నా, గొంతు మంటగా ఉన్నా, ఒరెగానో ఆకుల్ని వాడతారు. త్వరగా ఫలితం కావాలంటే ఒరెగానో ఆయిల్‌ని కప్పు గోరు వెచ్చటి నీటిలో ఒకట్రెండు చుక్కలు వేసి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.


ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నచోట ఒరెగానో ఆయిల్ రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చలికాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఒరెగానో ఆకులకు ఉంది.


బాడీలో వేడిని తగ్గించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. బాడీలో వేడి పెరిగే కొద్దీ గుండె సమస్యలు, డయాబెటిస్ వంటి ఇతర సమస్యలు వస్తాయి. అందువల్ల ఇలాంటి ఆకుల్ని కూరల్లో వేసేసుకుంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 


3 లక్షల రుణం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇలా పొందండి

 


పథకం పేరు:

ఈ పథకం పేరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 1న ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు రకరకాల వృత్తులు చేపడుతూ, కేంద్రం నుంచి ఉచితంగా రూ.15,000 మనీ, అలాగే అవసరమైన రుణం కూడా తీసుకోవచ్చు. ఇలా ఇప్పటికే కేంద్రానికి కోటికి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. 4 లక్షల మందికి పైగా మనీ తీసుకున్నారు. మిగతా వారి అప్లికేషన్ల పరిశీలన జరుగుతూ ఉంది.


మనీ ఎవరికి ఇస్తారు?

కార్పెంటర్ (వడ్రంగి), పడవ తయారీదారు, బంగారు నగల తయారీదార్లు, నిర్మాణ కార్మికులు, లోహ కళాకారులు, సుత్తి తయారీదారు, టూల్ కిట్ల తయారీదారు, విగ్రహాల తయారీదారు, రాళ్లను పగలగొట్టేవారు, కుమ్మరివారు, చెప్పుల తయారీదారు, దుప్పట్లు, పరుపులు, చాపల తయారీదార్లు, బొమ్మల తయారీదార్లు, కొబ్బరిపీచుతో తాళ్లు చేసేవాళ్లు, బార్బర్, పూలదండల తయారీదార్లు, బట్టలు ఉతికేవారు, టైలర్లు, చేపల వలలు తయారుచేసే వారు, ఇతర వంటి వృత్తుల వారికి కేంద్రం ఈ డబ్బును ఇస్తుంది.


అర్హతలేంటి?

పైన చెప్పుకున్న వృత్తుల వారంతా అర్హులే. వారి వయస్సు 18 ఏళ్లు దాటి ఉండాలి. అప్లై చేసుకునేవారు ప్రస్తుతం ఆ పని చేస్తూ ఉండాలి. అలాగే వారు ఆ పని కోసం, గత ఐదేళ్లలో ఇలాంటి ఇతర పథకాల్లో రుణం తీసుకొని ఉండకూడదు. ప్రభుత్వ సర్వీసుల్లో ఉండేవారు, వారి కుటుంబ సభ్యులూ ఈ పథకానికి అనర్హులు.


పథకం ప్రయోజనాలు:

ఈ పథకం కోసం అప్లై చేసుకునేవారికి కేంద్రం విశ్వకర్మ సర్టిఫికెట్ ఇస్తుంది. ఐడీ కార్డు ఇస్తుంది. 40 గంటలపాటూ ఉచిత ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్ 5 నుంచి 7 రోజులు ఉంటుంది. ఈ సమయంలో కేంద్రం స్టైపెండ్ కింద రోజూ రూ.500 చొప్పున ఇస్తుంది. ట్రైనింగ్ తర్వాత మీరు టూల్ కిట్ కొనుక్కోవడం కోసం మీకు రూ.15,000 ఇస్తుంది. అలాగే మీరు 18 నెలల్లో చెల్లించేలా రూ.1 లక్ష రుణం పొందవచ్చు. తర్వాత మరో 30 నెలల్లో చెల్లించేలా రూ.2లక్షల రుణం తీసుకోవచ్చు. ఈ రుణంపై కేంద్రం 5 శాతం వడ్డీ తీసుకుంటుంది. ఈ డబ్బుతో మీకు మీరే సొంతంగా షాపు పెట్టుకోవచ్చు.


ఎలా అప్లై చేసుకోవాలి?

ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmvishwakarma.gov.in/Login లోకి వెళ్లాలి. అక్కడ మొబైల్ నంబర్, కాప్చా కోడ్ ఎంటర్ చెయ్యాలి. తర్వాత ఆధార్ నంబర్ ఇవ్వాలి. అప్పుడు మీకు ఓ రిజిస్ట్రేషన్ ఫారమ్ వస్తుంది. దాన్ని నింపి, సబ్‌మిట్ కొట్టాలి. తర్వాత మీకు డిజిటల్ రూపంలో ట్రైనింగ్ ఇస్తారు. అలాగే విశ్వకర్మ డిజిటల్ ఐడీ, సర్టిఫికెట్ ఇస్తారు. తర్వాత మీరు రూ.15000 పొందడం, రుణం పొందడం వంటివి చేసుకోవచ్చు.

Sunday, February 11, 2024

మొక్కజొన్న పీచును పారేయకండి.. ఇలా వాడుకోండి


 సాధారణంగా మనం మొక్కజొన్న తిని, దాని పొట్టును పారేస్తాం. మొక్కజొన్న గింజలను తీసి, పొట్టు పారేయడం మీరు గమనించి ఉండవచ్చు. ఈ పొట్టు మొక్కజొన్న గింజలపై రక్షణ కవచంలా ఉంటుంది. పై ఆకులు తొలగిస్తే, లోపల ఈ పొట్టు మెత్తగా ఉంటుంది. మనం చెత్త అనుకుంటూ పారేసే ఈ పీచులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కజొన్నలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. మొక్కజొన్న పీచులో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. 


డయాబెటిస్‌తో బాధపడేవారికి మొక్కజొన్న పీచు మేలు చేస్తుంది. రక్తంలో షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. వారి రక్తంలో షుగల్ లెవెల్స్ సరి అవుతాయి. తద్వారా వారి ఆరోగ్యం మెరుగవుతుంది. అజీర్ణ సమస్యతో బాధపడే వారికి మొక్కజొన్న పీచుతో మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పీచులో ఫైబర్ ఉంటుంది. ఇది ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మొక్కజొన్న పీచును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరగడం తగ్గుతుంది. తద్వారా రక్త సరఫరా బాగా జరుగుతుంది. తద్వారా గుండెకు రక్త ప్రసరణ బాగుంటుంది.


మొక్కజొన్న పీచు టీ:

మొక్కజొన్న పీచును మనం డైరెక్టుగా తినలేం. అలవాటు ఉండదు కదా.. తినబుద్ధి కాదు. అందువల్ల మనం టీ చేసుకొని తాగొచ్చు. ఎలాగంటే, మొక్కజొన్న పీచుని గ్లాసు నీటిలో వేసి, 5 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడగట్టి, ఆ నీటిలో నిమ్మరసం కలిపి, టీ లాగా తాగాలి. కావాలంటే కొద్దిగా పంచదార లేదా తేనె కూడా వేసుకోవచ్చు. ఈ టీని పిల్లలు, గ‌ర్భిణీలు, మందులు వాడే వారు తాగ‌కూడదు. 


(గమనిక: ఇది సాధారణ సమాచారం. అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి)

Saturday, February 10, 2024

కౌలు రైతులకు రైతుబంధు. ఈ పంటలకు వర్తింపు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

 


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కౌలు రైతులకు రైతుబంధు పథకం వర్తింపుకి సంబంధించి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఉప ముఖ్యమంత్రి, అర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రైతు భరోసా స్కీమ్‌ని బడ్జె్ట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇప్పటివరకూ రైతులకు మాత్రమే అమలులో వున్న రైతుబంధు పథకం బదులు, రైతు భరోసా పథకం ద్వారా కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం వర్తింపజేసేలా డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్ జారీ చేశారు. 


రైతు భరోసా పథకం ప్రకారం రైతులు ఎకరాకి రూ.15000 పొందుతారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సంవత్సరంలో 3సార్లు రూ.5వేల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. లేదా రూ.7500 చొప్పున 2సార్లు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కౌలు రైతులు కూడా సంవత్సరానికి, ఎకరానికి రూ.15000 చొప్పున పొందుతారని ప్రభుత్వం తెలిపింది. అలాగే రైతు కూలీలు సంవత్సరానికి ఎకరాకి రూ.12000 చొప్పున పొందుతారు. 


ఏయే పంటలకు వర్తిస్తుంది?

వరి, సోయాబీన్, బఠాణీలు, పత్తి, పచ్చిమిర్చి, మొక్కజొన్న, చెరకు ఇతర స్థానికంగా పండే పంటలకు రైతు భరోసా వర్తిస్తుంది. 


రైతుబంధు లేదా రైతు భరోసా ఎలా పొందాలి?

రైతులు మండల రెవెన్యూ ఆఫీసర్ (MRO) లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. వారికి కింది పత్రాల జిరాక్స్ కాపీలు ఇవ్వాలి.

ఆధార్ కార్డు, భూమి హక్కు పత్రాలు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, అడ్రెస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, కుల ధృవీకరణ పత్రం, బీపీఎల్ (దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారు) సర్టిఫికెట్ (అవసరమైతే) ఇవ్వాలి. దీనిపై మరింత సమాచారం కోసం రైతులు హెల్ప్‌లైన్ నంబర్‌కి ఉచితంగా కాల్ చెయ్యవచ్చు. ఆ నంబర్ 040 2338 3520.


ఆన్‌లైన్‌లో 

తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుభరోసా, రైతుబీమా కోసం కొత్తగా https://rythubandhu.telangana.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ప్రారంభించింది. ఇందులో కూడా రైతులు తమ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఇందుకోసం వారు ఈ లింక్ https://rythubandhu.telangana.gov.in/Default_RB1.aspx# లోకి వెళ్లాలి. అక్కడ వారికి cheque distribution venue schedule అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్లాలి. అప్పుడు.. జిల్లా, మండలం ఎంపిక చేసుకోవాలి. అప్పుడు వారి వివరాలు అక్కడ కనిపిస్తాయి. చెక్ ఎప్పుడు ఇచ్చేదీ తేదీలతో సహా వివరాలు లభిస్తాయి.


ఎప్పటి నుంచి అమలవుతుంది?

కౌలు రైతులకు రైతుబంధు, రైతు భరోసా పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. త్వరలోనే అంటోంది. అందువల్ల ఈలోగా రైతులు తమ పేర్లను నమోదు చేయించుకుంటే, పథకం అమల్లోకి రాగానే, ప్రయోజనం పొందవచ్చు.

Bharat Dal: రూ.60కే కేజీ పచ్చి శనగపప్పు.. సగం ధరకే ఇలా కొనుక్కోండి

Bharat Dal: రూ.60కే కేజీ పచ్చి శనగపప్పు

Bharat Dal: మనం బయట పచ్చి శనగపప్పు కొంటే దాని ధర కేజీ రూ.100 నుంచి రూ.150 దాకా ఉంది. ఒక్కొక్కరూ ఒక్కో ధరకు అమ్ముతున్నారు. ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో కూడా ధర ఎక్కువగానే ఉంది. పైగా, ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు ఒక్కోసారి డెలివరీ ఛార్జీల కింద మరో రూ.40 తీసుకుంటూ ఉంటారు. అందువల్ల మనం తక్కువ ధరకు సరుకులు కొనాలంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటాం. కొంతమంది డీ-మార్ట్ స్టోర్ లాంటి వాటిలో కొంటుంటారు. ఐతే.. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ సగం ధరకే పప్పులను అమ్ముతోంది. వాటిని ఎలా కొనాలో తెలుసుకుందాం.


NAFED వంటి అధికారిక సైట్లలో కేంద్రం పప్పు దినుసుల్ని తక్కువ ధరకు అమ్ముతోంది. తాజాగా జియో మార్ట్, బిగ్ బాస్కెట్, అమెజాన్ వంటి సైట్లలో కూడా తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇవి భారత్ దాల్, భారత్ రైస్ వంటి బ్రాండ్ నేమ్‌తో లభిస్తున్నాయి. కొన్ని సైట్లలో ఈ సరుకులు ఇప్పటికే ఉండగా, మరికొన్ని సైట్లు ఇప్పుడిప్పుడే వీటిని అమ్మడం మొదలుపెట్టాయి. మీకు తెలిసే ఉంటుంది. భారత్ రైస్ ఇప్పటికే రూ.29కి లభిస్తోంది. అలాగే మీరు పచ్చి శనగపప్పును కేజీ రూ.60కే కొనాలంటే, ఎలాగో చూద్దాం.


మీరు NAFED అధికారిక వెబ్‌సైట్ https://www.nafedbazaar.com/ లోకి వెళ్లండి. అక్కడ మీకు చాలా పప్పు దినుసులు తక్కువ ధరకే లభిస్తాయి. వాటిలో మీకు కావాల్సిన వాటిని Add to Cart ద్వారా సెలెక్ట్ చేసుకొని.. ఆ తర్వాత ఆర్డర్ ఇచ్చి, మీ ఇంటి అడ్రెస్ ఇస్తే, డోర్ డెలివరీ అవుతాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎలా కొంటామో, ఇక్కడా అలాగే కొనుక్కోవచ్చు. 


కొంతమంది నాఫెడ్ తమ ఏరియాలో డెలివరీ చెయ్యట్లేదని చెబుతున్నారు. అలాంటి వారు జియో మార్ట్, బిగ్ బాస్కెట్ వంటి సైట్లలో కొనుక్కోవాల్సి వస్తోంద. ఐతే, కేంద్రం త్వరలోనే దేశమంతా నాఫెడ్ సరుకులు అందుబాటులోకి వచ్చేలా చెయ్యాలని ప్రయత్నిస్తోంది. అందువల్ల త్వరలోనే దేశ ప్రజలంతా తక్కువ ధరకే భారత్ రైస్, భారత్ పచ్చి శనగపప్పు, భారత్ మినప్పప్పు, భారత్ వేపినపప్పు వంటి చాలా పప్పులను కొనుక్కోగలరు.

చికెన్ గ్రేవీ రెసిపీ.. ఇలా చేశారంటే.. చిటుక్కున అయిపోతుంది

chicken recipe

చికెన్‌లో ప్రోటీన్స్ ఉంటాయి. అవి మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఐతే ఎప్పుడూ రొటీన్‌గా చికెన్ కర్రీయో, ఫ్రై చికెనో వండుకుంటే రొటీన్ టేస్ట్ అవుతుంది. కాస్త కొత్తగా ట్రై చేస్తే, అదిరిపోయే కొత్త టేస్ట్ చూడవచ్చు. ప్లస్ మనకు ఓ కొత్త వంట చేయడం కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్లకు అలా చేసి పెడితే, వావ్ సూపర్ అంటూ లొట్టలేసుకు తింటారు. అలాంటి ఓ చక్కటి, అదిరిపోయే గ్రేవీతో చికెన్ కర్రీని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి 10 నిమిషాలు, వంట చేయడానికి 30 నిమిషాలు పడుతుంది.


చికెన్ గ్రేవీ కోసం కావాల్సినవి :

500 గ్రాముల చికెన్

4 టేబుల్ స్పూన్ల నూనె

1 టీస్పూన్ జీలకర్ర

1 దాల్చిన చెక్క ముక్క లేదా పొడి

2 యాలకులు

2 పెద్ద ఉల్లిపాయలు (ముక్కలు కోసి పెట్టుకోవాలి)

2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్

2 టమాటాలు (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి

2 టీస్పూన్ల కారం

1 టీస్పూన్ జీర పొడి

1 టీస్పూన్ గరం మసాలా పౌడర్

ఉప్పు సరిపడా వేసుకోవాలి.


రోస్ట్ చేసి, గ్రైండ్ చేసుకోవాల్సినవి: (వీటిని పొడిలా చేసుకోవాలి)

1 టీస్పూన్ సోంపు

2 టీస్పూన్ల నల్ల మిరియాలు


చికెన్ గ్రేవీ తయారీ విధానం:

ముందుగా మిరియాలు, సోంపు గింజల్ని వేపాలి. అవి వేడి తగ్గాక, గ్రైండ్ చేసి, పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో నూనె వేసి వేడి చెయ్యాలి. అందులో దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు వెయ్యాలి. వేగనివ్వాలి. బుడగలు వస్తున్నప్పుడు, టప్ టప్ మని జీలకర్ర అంటున్నప్పుడు వెంటనే, ఉల్లిపాయలు వెయ్యాలి. బంగారు, గోధుమ రంగులోకి వచ్చే వరకు వేపాలి. వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఇప్పుడు టమాటాలు వేసి, అవి గుజ్జులా మారేవరకూ కదుపుతూ వేపుతూ ఉండాలి.


ఉప్పు, గరం మసాలా పౌడర్, ఇతరత్రా అన్నీ వేసేయాలి. ఐతే.. మిరియాల పొడి, సోంపు పొడి మాత్రం అప్పుడే వెయ్యకూడదు. ఇప్పుడు చికెన్ వేసి, బాగా కలపాలి. ప్రెషర్ కుక్కర్ మూసేసి, నాలుగైదు, విజిల్స్ వచ్చేవరకూ వండాలి. తర్వాత సిమ్‌లో పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత మంట ఆర్పేసి, ఆవిరి పోయేలా అలా వదిలేయాలి.


ఆవిరి పోయాక, కుక్కర్ తెరిచి, నీరు పొయ్యాలి. చికెన్ కావాల్సినంతగా ఉడికేలా చెయ్యాలి. ఇప్పుడు చివరలో మిరియాల పొడి, సోంపు పొడి వెయ్యాలి. ఇవి ఆప్షన్ మాత్రమే. వెయ్యకపోయినా పర్వాలేదు. వేస్తే మాత్రం బాగా కలిపి, వేడివేడిగా వడ్డించేయడమే.


ఈ గ్రేవీ చికెన్ కర్రీ, అన్నంతోపాటూ, రోటీ, పులావ్‌లోకి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అదిరిపోతుంది. నోరు ఊరుతూ ఉంటుంది. పుల్లపుల్లగా, స్పైసీగా భలే ఉందే అనిపిస్తుంది.

రేగుపండ్లు తింటున్నారా? ఇది మీరు తెలుసుకోవాల్సిందే!.. ఎప్పటికీ మర్చిపోరు

jujube good for health (image credit - x - @SreenathSha)

చూడటానికి దాదాపు ఖర్జారాలలా కనిపించే రేగు పండ్లను రెడ్ డేట్స్, చైనీస్ డేట్, కొరియా డేట్, ఇండియా డేట్ అని కూడా పిలుస్తుంటారు. ఇండియాలో వసంత రుతువు రాగానే రేగు పండ్లు కాస్తాయి. జుజుబీగా పిలిచే ఈ పండ్లు దక్షిణ ఆసియాలో ఎక్కువగా పండుతాయి. బెర్ ఫ్రూట్ (రేగు పండు) రకరకాల రంగుల్లో కనిపిస్తుంది. ఎండిన రేగు పండు డార్క్ రెడ్ లేదా పర్పుల్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. పచ్చి రేగు మాత్రం గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. మన శరీరానికి చక్కటి పోషకాలు కావాలంటే రేగు పండ్లను తినాల్సిందే.


చర్మాన్ని మెరిపిస్తాయి:

రేగుపండ్లలో సీ విటమిన్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన వయసు పెరుగుదలను తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెండ్స్ మన చర్మ కణాల్లో ఫ్రీ రాడికల్స్ (వ్యర్థాలు)తో పోరాడతాయి. కణాలు పాడవ్వకుండా చేస్తాయి. అలాగే విటమిన్ సీ, మన ముఖాన్ని కాపాడుతుంది. మచ్చల్ని పోగొట్టి, చర్మం మెరిసేలా చేస్తుంది. త్వరగా ముసలితనం రాకుండా కాపాడుతుంది. రేగుపండ్లు డల్ స్కిన్‌ను క్లియర్ చేసి, ఎంతో మేలు చేస్తాయి.


చక్కగా రక్త ప్రసరణ:

ఈ చిన్న రేగు పండ్లలో పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాలు వుంటాయి. ఈ మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం. ఎనీమియాగా పిలిచే రక్త హీనత సమస్య నుంచీ మనల్ని కాపాడతాయి రేగు పండ్లు. రక్త ప్రసరణ సాఫీగా సాగాలంటే రేగు పండ్లు మన శరీరానికి అవసరం. మనం తినే ఆహారంలో పోషకాలు శరీరానికి చేరాలంటే ఐరన్ తప్పనిసరి అనే విషయం మర్చిపోవద్దు.


ఎముకలకు మేలు:

ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. మన ఎముకలు దృఢంగా, గట్టిగా ఉండేందుకు అవి ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే, వారికి ఈ పండ్లు తినిపించడం సరైన పరిష్కారం. కీళ్ల వాపులు, నొప్పులూ ఉన్నవారు సైతం, ఈ పండ్లు తింటే మంచిది. వీటిలోని యాంటీ-ఇన్ఫమేటరీ గుణాలు, కీళ్ల నొప్పులు, మంటల్ని చల్లబరుస్తాయి.


చక్కగా మెటబాలిజం:

మన శరీరానికి ఏవి ఎంత కావాలో డిసైడ్ చెయ్యడంలో రేగు పండ్లు ఉపయోగపడతాయి. తేలిగ్గా జీర్ణమయ్యే ఈ పండ్లు, ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలతో మన శరీర జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలోని పీచు పదార్థం (ఫైబర్), మలబద్ధకాన్ని పోగొడుతుంది. పొట్టలో గ్యాస్ వంటి సమస్యలు ఉంటే, రేగు పండ్లు తినడం మంచిది.


మంచి నిద్రను ఇచ్చే పండ్లు: 

కొంతమందికి ఎంత ట్రైచేసినా నిద్రపట్టదు. చివరకు నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సరైన పండ్లు రేగు పండ్లు. ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్, పోలీశాచురైడ్స్, ఫ్లేవనాయిడ్స్, సాపోనిన్స్ వంటివి ఉన్నాయి. ఇవి నిద్రబాగా వచ్చేలా చేస్తాయి. నరాలను శాంతపరచడం ద్వారా ఇవి మనం చక్కగా నిద్రపోయేలా చేయగలవు. టెన్షన్, ఒత్తిడి వంటివి తగ్గాలంటే కూడా రేగుపండ్లు తినాలి.


ఇది మర్చిపోవద్దు:

అంతా బాగానే ఉన్నా, రేగు పండ్లతో ఓ సమస్య ఉంది. ఇవి విపరీతంగా వేడి చేస్తాయి. ఈ పండ్లు ఓ 5 తింటే చాలు, బాడీ వేడెక్కిపోతుంది. వేడి చేస్తుంది. కాబట్టి వీటిని మరీ ఎక్కువ తినకూడదు. బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ పండ్లు బెటర్. ఇవి శరీరంలో కొవ్వును ఐస్‌క్రీమ్ లాగా కరిగిస్తాయి. 


(గమనిక: ఇది సాధారణ సమాచారం. అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి)

నోరూరించే చికెన్ రసం రెసిపీ. ఇలా తయారుచేసుకోండి

Chicken Recipe (image credit - x - @yindian5)

రుచికరమైన చికెన్ కర్రీ వండుకొని తినడం ఓ ఆర్ట్. చికెన్‌ని మనం వంద రకాలుగా వండుకోవచ్చు. ఈ కర్రీ తినడం వల్ల ఎనర్జీ పెరగడమే కాదు.. ఆరోగ్యకరం కూడా. ముఖ్యంగా ప్రోటీన్ సమస్యతో బాధపడేవారు చికెన్ కర్రీ తింటే, సమృద్ధిగా ప్రోటీన్స్ లభిస్తాయి. ఇవి వ్యాధులతో పోరాడటంలో ఎంతో బాగా పనిచేస్తాయి. అందుకే డాక్టర్లు వారానికి రెండుసార్లైనా చికెన్ తినమని చెబుతుంటారు. మరి చికెన్ కర్రీని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని, మరో 20 నిమిషాల్లో వండుకోవడానికి.. చికెన్ రసం రెసిపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది తమిళనాడులోని చెట్టినాడులో ఫేమస్. సంప్రదాయబద్ధమైన రసంతో ఈ కర్రీ చేస్తారు. ఇదో మంచి సూప్‌లా ఉంటుంది. ఎంతో స్పైసీగా ఉన్నా, కడుపులో ఎలాంటి సమస్యలూ రావు.


చికెన్ రసం పొడి కోసం కావాల్సినవి:

1 టీస్పూన్ నెయ్యి

1 టీస్పూన్ నల్ల మిరియాలు

1 టీస్పూన్ ధనియాలు

1 టీస్పూన్ జీలకర్ర

1 టీస్పూన్ సోంపు

5-6 ఎండిమిర్చి


చికెన్ రసం రెసిపీ కోసం కావాల్సినవి:

350 గ్రాముల చికెన్ బోన్స్ (కొద్దిగా మాంసం ఉండాలి)

1 టీస్పూన్ పసుపు

1 టీస్పూన్ ఉప్పు

1న్నర లీటర్ల నీరు


ట్యాంపరింగ్ కోసం కావాల్సినవి:

1 టీస్పూన్ నెయ్యి

1 టీస్పూన్ జీలకర్ర

2 రెబ్బల కరివేపాకులు

1 మీడియం సైజు ఉల్లిపాయ (చిన్నగా కట్ చేసుకోవాలి)

1 మీడియం సైజు టమాట (చిన్నగా కట్ చేసుకోవాలి)

1 టీస్పూన్ ఉప్పు


చికెన్ రసం తయారీ విధానం:

రసం పొడి కోసం, కావాల్సిన వాటిని ముందుగా 1 టీస్పూన్ నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తూ, సువాసన వస్తున్నంత వరకూ వేపుకోవాలి. తర్వాత అదంతా మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యమధ్యలో కదుపుతూ, గ్రైండ్ చేస్తే ఎక్కువ మెత్తగా అవుతుంది.


ఇప్పుడు చికెన్ ఎముకలకు పసుపు రాసి, ఉప్పు వేసి, నీటిలో ఉంచి, 10 నిమిషాలపాటూ, ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించాలి. తర్వాత మంట ఆర్పి, కుక్కర్ రిలీజ్ చెయ్యాలి.


ఇప్పుడు నీటిని వేరు చేసి, చికెన్ ఎముకల నుంచి చికెన్‌ను వేరు చెయ్యాలి. రెండింటినీ వేరువేరుగా ఉంచాలి.


ప్యాన్‌లో నెయ్యి వేసి, జీలకర్ర, కరివేపాకుల్ని వేపాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చెయ్యాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి, ఉప్పు వెయ్యాలి. టమాటా ముక్కలు ఉడికే వరకూ ఉంచాలి. ఇప్పుడు రసం పౌడర్ వెయ్యాలి. కొన్ని నిమిషాలవరకూ తిప్పుతూ, కదుపుతూ ఉండాలి. ఇప్పుడు చికెన్‌ను వేసి. బాగా కలపాలి. ఇప్పుడు పైన వేరు చేసిన నీటిని పోసి, ఐదు నిమిషాలవరకూ సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు చికెన్ రసం రెసిపీ రెడీ. వేడి వేడి సూప్‌లా సెర్వ్ చేయవచ్చు.

గులాబీ రేకల జామ్‌తో చర్మానికి రక్షణ.. ఇంట్లోనే ఇలా తయారుచేసుకోండి

Rose petal jam (image credit - x - @ayush_mp)

గులాబీలు మనందరికీ నచ్చుతాయి. రంగురంగుల ఈ పూలను బ్రిటీష్ వారు ఇండియాకి తెచ్చారు. ఇప్పుడు ప్రపంచమంతా ఈ పులు ఉన్నాయి. గులాబీలతో రకరకాల సెంట్లు తయారుచేస్తారు. కాస్మెటిక్ ఉత్పత్తుల్లో కూడా గులాబీలను వాడుతారు. గులాబీ రేకలతో తయారుచేసే జామ్, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీన్నే రోజ్ పెటల్ జామ్ లేదా గుల్కండ్ అని కూడా అంటారు. 


ప్రయోజనాలు:

చర్మ సంబంధిత సమస్యలను నివారించి ముఖాన్ని ఎంతో ఆకర్షణీయంగా చేస్తుంది ఈ జామ్. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. శరీరానికి తగినంత ఐరన్, ప్రోటీన్లను సమకూరుస్తుంది. గట్ ఫ్లోరా, పేగు సంబంధిత సమస్యలకు ఈ జామ్ సరైన నివారణ. హైపర్ ఏసీడీటీ (Acidity), నోటి పూతలు, గర్భిణీ స్త్రీలకు ఇది మేలు చేస్తుంది. అలాగే పిల్లల్లో మలబద్ధక సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. మొటిమలు, మచ్చలు లాంటి చర్మ సమస్యల్ని తగ్గిస్తుంది. ఈ జామ్ తిన్న వారికి నిద్ర బాగా పడుతుంది. మూత్రం చక్కగా వచ్చేలా సాయపడటమే కాకుండా, ఎడెమా రోగులకు ఇది సరిగ్గా పనిచేస్తుంది. ఈ జామ్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు:

గులాబీ రేకలు 250 గ్రాములు

పంచదార 250 గ్రాములు


తయారీ విధానం:

తాజా గులాబీ రేకలను పువ్వుల నుంచి వేరు చేసి, బాగా కడగాలి. తర్వాత అవి పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టాలి. తర్వాత వాటిని పొడిలాగా, చూర్ణంలాగా చేయవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకుని పంచదార కలపాలి. తర్వాత గాలి చేరని సీసాలో వేసి 2 నుంచి 3 వారాల పాటు సూర్యకాంతి తగిలేలా ఉంచాలి. శుభ్రమైన పొడి చెంచాతో ప్రతిరోజు ఆ మిశ్రాన్ని కదిలించాలి. మూడు వారాల తర్వాత, దాన్ని వాడుకోవచ్చు. జామ్ లాగా రోజూ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల గుల్కండ్‌ను తినవచ్చు. చక్కెర ఉంటుంది కాబట్టి ఇది తియ్యగా, చిక్కని జ్యూస్‌లా ఉంటుంది. దీని ప్రయోజనాలు వాడిన రోజు నుంచే కనిపిస్తాయి.


(గమనిక: ఇది సాధారణ సమాచారం. అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి)

జుట్టు తెల్లబడుతోందా? వెంటనే ఇలా చెయ్యండి, డాక్టర్ల చిట్కాలు పాటించండి!

white hair, hairfall,

 

వెంట్రుకలు నల్లగా ఉన్నంతకాలం మనకు సమస్యగా అనిపించదు. ఒక్కసారి అవి తెల్లగా అవ్వడం మొదలైతే, ఇక ఆందోళన మొదలవుతుంది. చుట్టుపక్కల వాళ్లు తెల్ల జుట్టు వచ్చేస్తోంది అని కామెంట్లు చేస్తే, అది మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. సహజంగా వయసు పెరిగేకొద్దీ జుట్టు తెల్లబడుతుంది. కొన్ని సందర్భాల్లో వయసుతో సంబంధం లేకుండా కలర్ మారిపోతుంది. జుట్టుకు నల్ల రంగును తెచ్చే మెలనిన్, తలలోని చర్మం కింది భాగంలో, వెంట్రుకల్లో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల జుట్టు తెలుపు రంగులో కనిపిస్తుంది. అంటే తెలుపు అనేది రంగు కాదు. ప్రతీ వెంట్రుకా పారదర్శకంగా, ఓ గొట్టంలా ఉంటుంది. అందులో మెలనిన్ ఉంటే అది నలుపు రంగులో కనిపిస్తుంది. మెలనిన్ లేకపోతే, గొట్టం ఖాళీగా ఉండి, వెంట్రుక తెలుపుగా కనిపిస్తుందంతే.


మెలనిన్ ఉత్పత్తి ఆగిపోవడానికి కారణాలు:

జన్యువులు:

తల్లిదండ్రులకూ, తాత ముత్తాతలకు త్వరగా వైట్ హైయిర్ వస్తే, వాళ్ల పిల్లలకూ, మనవళ్లకు కూడా అలా జరిగే అవకాశాలు ఉంటాయి. దీనికి కారణం DNA. దీన్నే మనం జన్యువులు అంటాం. జన్యువుల్లో మార్పులు తెస్తే, ఇలా అవ్వకుండా చెయ్యవచ్చు. దీనిపై నిరతరం పరిశోధనలు జరుగుతున్నాయి.


టెన్షన్లు:

పని ఒత్తిళ్లు, టెన్షన్లు, బిజీ లైఫ్ స్టైల్, నిద్రలేమి, ఆహార మార్పులు, హైబీపీ వంటివి మన తలలో మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.


ఆటో ఇమ్యూన్ డిసీజ్:

ఒక్కోసారి మన శరీరంలోని వ్యాధి నిరోధకత తన సొంత కణాలపైనే దాడి చేస్తుంది. అలా జరిగినప్పుడు కూడా మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.


థైరాయిడ్ సమస్య:

మన గొంతులో సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది శరీరంలోని చాలా అవయవాలు సరిగా పనిచేసేలా చేస్తుంది. ఇది సరిగా పనిచెయ్యకపోతే… మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.


విటమిన్ B-12 తగ్గిపోతే:

త్వరగా జుట్టు నెరిసిపోయిందంటే దానర్థం మనలో విటమిన్ B-12 సరిపడా లేనట్లే. ఇది జుట్టుకు ఎంతో మేలు చేసే విటమిన్. ఇది ఆక్సిజన్‌ను తీసుకెళ్లే ఎర్రరక్తకణాలు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ బీ-12 సహకరిస్తుంది. అది లేనప్పుడు ఎర్రరక్తకణాలు దెబ్బతిని, జుట్టు కణాలకు సరైన ఎర్రరక్తకణాలు చేరవు. ఫలితంగా జుట్టు కణాలు దెబ్బతిని మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. విటమిన్ B-12 కోసం చేపలు, బాదం, పీతలు, పాలు, వెన్న, గుడ్లు, చికెన్ తినాలని డాక్టర్లు చెబుతున్నారు.


స్మోకింగ్:

పొగతాగడం మానకపోతే, అది జుట్టుకి పొగబెడుతుందని పరిశోధనల్లో తేలింది. ఎలాగంటే పొగ ఎర్రరక్తకణాల్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా ఏమవుతుందో మీకు తెలుసు.


పరిష్కార మార్గాలు:

జన్యుపరంగా జుట్టు తెల్లబడితే మనం చేయగలిగేది ఏమీ లేదు. ఇతర కారణాలతో మార్పులు వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. జుట్టు మెలనిన్ పెంచుకోవడానికి క్యారెట్, నల్ల నువ్వులు, వాల్‌నట్స్, ఉసిరి, సాల్మన్ చేపలు, పుట్టగొడుగులు, మసూరి పప్పులు, చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తినాలి.


నల్ల జుట్టు కోసం చిట్కా:

నువ్వుల నూనె, మెంతుల  పొడిని కలిపి తలకు మసాజ్ చేసి, అరగంట తర్వాత స్నానం చేస్తే వెంట్రుకల్లో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుందని తెలిసింది.


(గమనిక: ఇది సాధారణ సమాచారం. అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి)

How sponge made? How does it absorb water? - స్పాంజిని ఎలా తయారుచేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకుంటుంది?

మనందరం ఇళ్లలో స్పాంజీలు వాడుతుంటాం. ఇల్లు తుడవడానికీ, ఫ్లోర్ క్లీన్ చెయ్యడానికీ, కిటికీల అద్దాలు మెరవడానికీ, ఇలా స్పాంజీ ఎన్నో రకాలుగా ఉపయోగ...